దేశంలో ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. పెద్ద దిక్కు కోల్పోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
దేశంలో నిత్యం ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వార్తలు చదువుతూనే ఉన్నాం. డ్రైవర్లు చేస్తున్న తప్పిదాల వల్ల ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, నిద్రలేమి, అతి వేగం ఇలా కారణాలు ఏవైనా డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. తాజాగా ఓ టిప్పర్ లారి అతి వేగంగా దూసుకు వచ్చి ఇంట్లోకి దూసుకు వెళ్లింది. ఈ ఘటన బూర్గంపాడు మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఎక్కువగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినం చేస్తున్నా వాహనదారులు మద్యం సేవించి, అతివేగంగా వాహనాలు నడిపి ఎంతోమంది ప్రాణాలు బలితీసుకుంటున్నారు. తాజాగా బూర్గంపాడు మండలం మోరంపల్లిబంజర్ నేషనల్ హైవే పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి టిప్పర్ లారీ అతి వేగంగా దూసుకు వెళ్లింది. స్థానికుల కథనం ప్రకారం.. లక్ష్మీపురం నుంచి పాల్వంచకు వెళ్తున్న ఓ టిప్పర్ లారీ అదుపు తప్పి మోరంపల్లిబంజరకు చెందిన చేతుల ఆనంద్ అనే వ్యక్తికి ఇంట్లోకి దూసుకువెళ్లింది.
ఆ సమయంలో ఆనంద్ దంపతులు ఇంటి వెనుకవైపు ఉన్నారు. అయితే ఇంట్లో నిద్రిస్తున్న వారి కుమారుడి తలకు గాయం అయ్యింది. ఈ ఘటనలో ఆనంద్ ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయినట్లు తెలుస్తుంది. ఆ సమయంలో ఇంట్లో ఒక్క బాబుకు మాత్రమే గాయాలు అయ్యాయి. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. క్లీనర్ క్యాబిన్ లో ఇరుక్కుపోవడంతో స్థానికులు అతన్ని బయటకు లాగారు.. అప్పటికే అతని రెండు కాళ్లు విరిగిపోయినట్లు సమాచారం. గాయపడ్డ డ్రైవర్, క్లీనర్లను భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బూర్గంపహాడ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూన్నారు.