తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ తొలి, మలి దశ చేపట్టిన ఉద్యమాల్లో అసువులు బాసిన అమరుల త్యాగాల ఫలితానికి గుర్తుగా కేసీఆర్ ప్రభుత్వం అమర వీరుల స్థూపాన్ని నిర్మించిన సంగతి విదితమే. అద్భుతమైన డిజైన్లతో రూపొందిన ఈ స్మారక చిహ్నం సిద్ధమైంది.
తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ తొలి, మలి దశ చేపట్టిన ఉద్యమాల్లో అసువులు బాసిన అమరుల త్యాగాల ఫలితానికి గుర్తుగా కేసీఆర్ ప్రభుత్వం అమర వీరుల స్థూపాన్ని నిర్మించిన సంగతి విదితమే. అద్భుతమైన డిజైన్లతో రూపొందిన ఈ స్మారక చిహ్నం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైనా జూన్ 22న ఆవిష్కరణ జరగనుంది. ఈ స్మారక చిహ్నాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ సాయంత్ర ఏడు గంటలకు ప్రారంభించనున్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఉన్న ప్రాంతలోనే జ్వలించే జ్యోతి రూపంలో దీన్నినిర్మించారు. ఇక్కడే పార్టీ కార్యాలయం వేదికగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలైంది. అంబేద్కర్ సచివాలయం ఎదురుగా, హుస్సేన్ సాగర్ సమీపాన ఈ స్థూపాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నేపథ్యంలో అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు.
సాయంత్రం నుండి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ అమరవీరుల స్తూపాన్ని మొత్తం 3.29 ఎకరాల్లో నిర్మించారు. ఇందులో ఆరు అంతస్తులు ఉన్నాయి. అండర్ గ్రౌండ్లో రెండు ఫ్లోర్లు ఉండగా.. పైన నాలుగు ఫ్లోర్లు ఉన్నాయి. 1,06,993చదరపు అడుగులతో బేస్ మెంట్ – 2, ఇంతే విస్తీర్ణంతో నిర్మించిన బేస్ మెంట్-1లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు 400 వరకు కార్లను పార్కు చేసుకోవచ్చట. గ్రౌండ్ ఫ్లోర్ 28,707 చదరపు అడుగులతో నిర్మితమైంది. ఇందులో ఒక ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంది. దీంట్లో మొదటి అంతస్తులు తెలంగాణ ఉద్యమ ప్రస్థానం అమరుల ఫోటోలతో పాటు ఒక థియేటరును కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం రాష్ట్ర సాధన కోసం జరిగిన రాజకీయ ప్రక్రియతో పాటు తెలంగాణ ప్రగతికి సంబంధించి 25 నిమిషాల నిడివి గల ఒక వీడియోను రూపొందించారు. 100 మంది వరకు ఈ థియేటర్ లో కూర్చుని వీడియో వీక్షించవచ్చు.
ఇక రెండో అంతస్తులు 600 మంది కూర్చునే విధంగా 16964 చదరపు అడుగుల్లో ఒక పెద్ద హాలు నిర్మించారు. మూడో అంతస్తులో 8095 చదరపు అడుగుల్లో, నాలుగో అంతస్తు 5900 చదరపు అడుగుల నిర్మాణం ఇది. అంతస్తులు ఓపెన్ రెస్టారెంట్ గ్లాస్ రూమ్ రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా సాయంత్రం భారీ ర్యాలీ ఉండనుంది. అతి పెద్ద డ్రోన్ షోను ఏర్పాటు చేశారు. కేసీఆర్ ప్రసంగం తర్వాత 800 డ్రోన్లతో అమరులకు నివాళి అందిస్తారు. మొత్తం ఈ స్థూపం నిర్మాణానికి రూ.180కోట్లు ఖర్చు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్ పూర్తిగా మూయనున్నారు. అలాగే ట్రాఫిక్ మళ్లించారు అధికారులు. వివి స్టాచ్యూ జంక్షన్, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ జంక్షన్, రవీంద్ర భారతి జంక్షన్, మింట్ కౌంపౌండ్ రోడ్, తెలుగు తల్లి జంక్షన్, పివిఎన్ఆర్ మార్గ్ రోటరీ, నల్లగుట్ట జంక్షన్, కట్టా మైసమ్మ జంక్షన్, ట్యాంక్ బండ్, లిబర్టీ జంక్షన్ మీదుగా రాకపోకలను మళ్లించారు.