తెలంగాణ నూతన సచివాలయానికి ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ఈ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అందుకున్నారు.
తెలంగాణ కొత్త సెక్రటేరియట్కు ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నూతన సచివాలయానికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అవార్డు దక్కింది. దేశంలోనే తొట్టతొలి గోల్డ్ రేటెడ్ సెక్రటేరియట్ బిల్డింగ్ కాంప్లెక్స్గా ఇది రికార్డుల్లోకి ఎక్కింది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సభ్యులు సోమవారం నాడు కొత్త సచివాలయంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. అత్యంత విశాలంగా, అధునాతన హంగులతో నూతన సెక్రటేరియట్ పర్యావరణహితంగా నిర్మించబడిందని చెప్పారు. సచివాలయం నిర్మాణానికి సీఎం కేసీఆర్ ఆచోచలనే కారణమని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పచ్చదనం 7.7 శాతానికి పెరిగిందన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఆయన ఆలోచనలకు అనుగుణంగానే సచివాలయం నిర్మాణం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తోందని తెలిపారు. సెక్రటేరియట్ బిల్డింగ్కు గోల్డ్ రేటెడ్ బిల్డింగ్ కాంప్లెక్స్గా గుర్తింపు రావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్న ప్రశాంత్ రెడ్డి.. త్వరలో ప్లాటినం అవార్డు కూడా గెలుచుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక పురస్కారానికి సంబంధించిన సర్టిఫికేట్ను ప్రదానం చేసిన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సభ్యులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సెక్రెటరీ శ్రీనివాస రాజు, ఈఎన్సీ గణపతి రెడ్డి, ఎస్.లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.