తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటు ముందుకు సాగుతున్నారు.
తెలంగాణలో కొంతకాలంగా రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. రాబోయే ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు రక రకాల వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. అధికార పార్టీ పలు అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ఉద్యోగులను సైతం ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఈ మద్యనే బిసీ, మైనార్టీలకు లక్షరూపాయల పథకాన్ని అమలు పరిచింది. నిన్న టీఎస్ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇలా వరుసగా తెలంగాణ ప్రజల మనసు దోచే ప్రయత్నం చేస్తుంది. తాజాగా సీఎం కేసీఆర్ బీడీ టేకేదార్లకు గొప్ప శుభవార్త తెలిపారు. వివరాల్లోకి వెళితే..
గత కొంతకాలంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల బీసీ, మైనార్టీలకు లక్షరూపాల పథకం, టీఎస్ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టినట్లు కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మరో కలక నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. బీడీ కార్మికులకు ఇస్తున్నట్లుగానే.. బీడీ టేకేదార్లకు కూడా ఆసరా పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో క్యాబినెట్ భీటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదన చేయగా.. మంత్రులు అంగీకారం తెలిపారు. కాగా, బీడీ కార్మికులు చేసిన బీడీలను లెక్కించి, ప్యాకింగ్ చేసి, కంపెనీలకు అప్పగించేవారిని బీడీ టేకేదార్లు అంటారు. సీఎం నిర్ణయంతో ఇక నుంచి బీడీ టేకేదార్లకు ఆసరా పెన్షన్ ఇవ్వబోతున్నారు.
క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికీ కట్టుబడి ఉంది. తెలంగాణలో పేదరికం పూర్తిగా నిర్మూలించాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం. ఇప్పటి వరకు బీడీ కార్మికులకు మాత్రమే ఆసరా పెన్షన్ ఇస్తున్నామని.. ఇక నుంచి బీటీ టేకేదారులకు సైతం రూ.2016 పెన్షన్ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించిందని అన్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో బీడీ టేకేదార్లు సంతోషంలో మునిగిపోయారు.. తమ బాధను అర్థం చేసుకొని ఆసరా పెన్షన్ ఇవ్వానే నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.