దీపావళి పండుగ సందర్భంగా గురువారం వ్యాక్సినేషన్కు సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. వ్యాక్సిన్ వేసే సిబ్బంది పండుగలో పాల్గొనే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. నవంబర్ 4న వాక్సినేషన్ కార్యక్రమానికి విరామం ఇచ్చి, శుక్రవారం నుంచి యథావిధిగా వ్యాక్సినేషన్ కొనసాగనుంది. అలాగే దీపావళి సందర్భంగా ఇంట్లో దీపాలు వెలిగించే వారు, టపాసులు కాల్చే వారు చేతులకు శానిటైజర్ వాడొద్దని అధికారులు సూచించారు. శానిటైజర్లో మండే గుణం ఉన్నందున దీపాలు వెలిగించే సమయంలో మంటలు అంటుకునే ప్రమాదం ఉందని అందకే దీపాలు పెట్టవేళ శానిటైజర్ వాడకపోవడం మంచిదని పేర్కొన్నారు.