ఒకప్పుడు దేశంలో ఆడవారు వంటింటికే పరిమితం అవుతూ.. ఎలాంటి స్వేచ్చ లేకుండా కుటుంబమే తమ జీవిత పరమార్ధంగా భావించి జీవించేవారు. కానీ ప్రస్తుత కాలంలో మగవారితో సమానంగా అడవారు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారు. పురుషులతో దీటుగా పని చేస్తారు. తెలంగాణ తొలి లైన్ ఉమెన్ గా ఒక యువతి సెలక్ట్ అయ్యింది. బబ్బూరి శిరీష అనే యువతి తెలంగాణలో మొట్ట మొదటి తొలి లైన్ ఉమెన్గా ఉద్యోగిగా నియామకం అయ్యింది. ఇక ఈ ఘనత సాధించినందుకు శిరీషను అభినందించారు మంత్రి జగదీశ్ రెడ్డి.
సిద్దిపేటకు చెందిన శిరీష చిన్నప్పటి నుంచి తాను ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే తపనతో విద్యాభ్యాసం చేసింది. ఆమె చదువు మేడ్చల్ లో కొనసాగింది. ఆ మద్య టిఎస్ఎస్పిడిసిఎల్ లో జేఎల్ఎం పోస్టుల కోసం జరిగిన రిక్రూట్ మెంట్ లో శిరీష ఉద్యోగాన్ని సంపాదించింది. ఈ పోస్టుల కోసం మొత్తం 38 మంది అమ్మాయిలు దరఖాస్తు చేసుకున్నారు.. అందులో 32 మాత్రమే హాజరయ్యారు. వారిలో పదకొండు మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అయితే కరెంట్ స్తంబం ఎక్కే పరీక్షలో ఇద్దరు మాత్రమే నెగ్గారు. వీరిలో ఒకరికి ట్రాన్స్కోలో ఉద్యోగం రాగా శిరీష డిస్కంలో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. అడవారు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారని.. విద్యుత్ శాఖలో మహిళలు కొత్త బాటలో పయనిస్తూ జేఎల్ఎం పోస్టులలో నియామకాలు చేపట్టడం అనేది గొప్ప విషయం అన్నారు. లైన్ ఉమెన్గా ఉద్యోగం ఇచ్చిన సంస్థగా టీఎస్ ఎస్పీడిసిఎల్ ఎప్పిటికీ చరిత్రలో మిగిలిపోతుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
టీఎస్ ఎస్పీడిసిఎల్ లో తొలిసారిగా లైన్ ఉమెన్ గా ఉద్యోగం పొందిన శిరిషకు నియామక పత్రాన్ని అందించి, అభినందించిన మంత్రి జగదీశ్ రెడ్డి,పాల్గొన్న టీఎస్ ఎస్పీడిసిఎల్ సీఎండీ రఘుమా రెడ్డి ఇతర ఉన్నతాధికారులు.@trspartyonline @KTRTRS @TelanganaCMO pic.twitter.com/EDH4eh3LOR
— Jagadish Reddy G (@jagadishTRS) May 11, 2022