తెలంగాణలో లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ముఖ్యంగా హైదరాబాద్లో పలుప్రాంతాల్లో ప్రజలు అనవసరంగా రోడ్లపైకి వస్తున్నారు. సీఎం కేసీఆర్ కూడా దీనిపై సీరియస్ అయ్యారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. స్వయంగా డీజీపీ లాక్ డౌన్ పరిశీలిస్తున్నారు. రోడ్డేక్కితే చాలు ఫీజులు వసూలు చేస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించని వారికి కేసులతో పోలీసులు వణుకు పుట్టిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా మరింత కఠినంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. డీజీపీ మహేందర్రెడ్డి రంగంలోకి దిగారు. హైదరాబాద్లో పలు చెక్పోస్టుల వద్ద తనిఖీలను ఆయన పర్యవేక్షించారు. లాక్ డౌన్ నిర్వహణపై రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి శనివారం కూకట్ పల్లిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ కరోనా కట్టడికి లాక్ డౌన్ ఆంక్షలను కఠినతరం చేయాలని ఆదేశాలను జారీ చేశారు. ఏ కారణం లేకుండా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేయాలని పోలీసులకు సూచించారు. అదేవిధంగా సీజ్ చేసిన వాహనాలను లాక్ డౌన్ తర్వాత కోర్టుకు వచ్చి తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. ఉదయం 10గంటల నుంచి మరసటి రోజు ఉ.6 గంటలవరకు రాష్ట్ర సరిహద్దులు మూసివేయాలన్నారు. బోర్డర్ దాటి రాష్ట్రంలోకి రాకుండా, బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించాలని సూచించారు. రాత్రి 8 గంటల నుంచి ఉ.6 గంటల వరకే గూడ్స్ వాహనాలకు అనుమతివ్వాలని తెలిపారు.