ర్యాగింగ్ కల్చర్ ఇటీవల కాస్త తగ్గిందని అనుకున్నంటున్న తరుణంలో తాజాగా సూర్యాపేటలోని వైద్య కళాశాలకు చెందిన హాస్టల్లో ఒక విద్యార్థి ర్యాగింగ్కు గురైన ఉదంతం కలకలం సృష్టించింది. ఒకప్పుడు ర్యాగింగ్ కల్చర్ పలు కళాశాలల్లో ఎన్నో విషాదాలు నింపాయి. సీనియర్ల ర్యాగింగ్ దాష్టికానికి జూనియర్లు ప్రాణాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి.
సూర్యాపేటలోని వైద్య కళాశాలకు చెందిన హాస్టల్లో కొంత మంది సీనియర్లు ఒక విద్యార్థిని ర్యాగింగ్ చేశారు. డిసెంబర్ 31న హైదరాబాద్ లోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లి, తిరిగి జనవరి 1న హాస్టల్ కు చేరుకున్న విద్యార్థిని.. సీనియర్ విద్యార్థులు తీసుకువెళ్లారు. విద్యార్థి బట్టలు విప్పి నగ్నంగా ఫోటోలు వీడియోలు తీశారు. తర్వాత ట్రిమ్మింగ్ మిషన్ తో జుట్టు తొలగిస్తుండగా.. భయాందోళనతో విద్యార్థి పరారయ్యాడు. సీనియర్ల నుంచి తప్పించుకొని ఫోన్లో పేరెంట్స్కు వివరించాడు విద్యార్థి. దీంతో విద్యార్థి తండ్రి డయల్ 100కు ఫిర్యాదు చేయడంతో బాధితుడిని పోలీసులు రక్షించారు.
ఇది చదవండి : ప్రముఖ సినీ దర్శకుడు కన్నుమూత!
ర్యాగింగ్ ఘటనపై విచారణకు ఆదేశం : మంత్రి హరీష్ రావు
సూర్యాపేట మెడికల్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్ విషయం తెలిసిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సూర్యాపేటలో వైద్య కళాశాలకు విద్యార్థిపై ర్యాగింగ్ జరగడం శోచనీయం అన్నారు. ఇక రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతే కాదు మెడికల్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్ ఘటనపై విచారణ చేయాలని డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ను ఆదేశించామని పేర్కొన్నారు. కళాశాలల్లో ర్యాగింగ్ ని నిషేదించిన విషయం తెలిసిందే అని ఆయన అన్నారు.