ఈ మద్య కాలంలో చిన్న చిన్న గొడవలకు మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆత్మహత్యలకు పాల్పపడటం లాంటివి చేయడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది.
ఈ మద్య చిన్న చిన్న సమస్యలకే తీవ్ర మనస్థాపానికి గురై సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షణికావేశంలో కొంతమంది ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ కాలేజ్ లో యువతులు పలు కారణాలతో ఆత్మహత్యలకు పాల్పపడటం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో మెడికల్ కాలేజ్ లో మెడికో ఆత్మహల్య చేసుకుంది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా నారాయణ మెడికల్ కాలేజ్ లో చైతన్య అనే మెడికో ఆత్మహత్యకు పాల్పపడింది. చైతన్య స్వస్థలం శ్రీకాకుళం జిల్లా పలాస. రెండు నెలల క్రితమే చైతన్యకు వివాహం జరిగింది. ప్రస్తుతం చైతన్య నారాయణ మెడికల్ కాలేజ్ హాస్టల్ లో ఉంటుంది. ఈ క్రమంలోనే హాస్టల్ గదిలో ఫ్యాన్ కి ఉరివేసుకొని బలవన్మరాణానికి పాల్పపడింది. హాస్టల్ గది నుంచి చైతన్య ఎంతకీ రాకపోవడంతో సహ విద్యార్థినులు సిబ్బందికి తెలియజేయండతో తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి చూస్తే.. ఫ్యాన్ కి ఉరివేసుకొని కనిపించింది. వెంటనే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న నెల్లూరు రూరల్ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం తరలించారు.
చైతన్య సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. చివరి కాల్ ఆమె తల్లికి చేసిందని.. అంతకు ముందు తన భర్తతో మాట్లాడినట్లు కాల్స్ లీస్ట్ లో ఉన్నాయని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. చైతన్య మరణానికి గల కారణాలు ఏంటీ అనే విషయంపై సమగ్ర విచారణ చేపట్టి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని అన్నారు పోలీస్ అధికారి. మరోవైపు పెళ్లైనప్పటి నుంచి చైతన్య ఆమె భర్తకు మద్య గొడవలు జరుగుతున్నాయని.. రెండు నెలలుగా దాంపత్య జీవితంలో కలహాల వల్లే చైతన్య ఆత్మహత్య చేసుకున్నట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.