నేటికాలంలో చాలామంది దగ్గర్లో ఉన్న షాపుకి వెళ్లి ఏదైనా వస్తువు తేవాలన్న బైక్ లేదా ఇతర వాహనాలను ఉపయోగిస్తారు. మరికొంత మంది అంత ఓపిక కూడా లేక ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తుంటారు. ఇంక కొంచె ఏజ్ మీద పడితే ఇక అంతే సంగతులు. కానీ ఓ 99 ఏళ్ల తాత ఆరోగ్యం అందరికి ఆదర్శం. ఆ వయస్సులో కూడా పరుగుల పోటీల్లో పాల్గొన్ని.. విజేతగా నిలిచాడు. అది నేటి తరం యువతకు స్ఫూర్తి.
నల్గొండాకు చెందిన యాదగిరి(99)ది వ్యవసాయ కుటుంబం. చిన్నతనం నుంచే ఆయన కూడా వ్యవసాయం చేసేవారు. వరి, కంది, ఇతర పంటలు సాగుచేసేవారు. పదేళ్ల క్రితం భార్య చనిపోయింది. ఆయనకు నలుగురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. యాదగిరి పిల్లలు, వాళ్ల పిల్లలతో కలుపుకుని మొత్తం 46 మంది ఉన్నారు. యాదగిరికి మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలేమీ లేవు. పొగ తాగడు. కంటిచూపు బాగానే ఉంది. ప్రస్తుతం ఉప్పల్లో కుమారుడి వద్ద ఉంటున్నారు. ఈక్రమంలో సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో RRC గ్రౌండ్ లో ఆరోగ్యవంతులైన సీనియర్ సిటిజన్లకు ఆటల పోటీలు నడుస్తున్నాయి.
99 ఏళ్ల యాదగిరి అక్కడికి వచ్చాడు. చూసేందుకు కాదు.. నడక పోటీలో తానూ పాల్గొనేందుకు. బరిలో నిలిచాడు. అంతేనా, అలుపన్నదే లేకుండా.. ఆయాసపడకుండా చకచకా నడిచాడు. అందరికన్నా ముందుగా లక్ష్యాన్ని చేరుకొని యాదగిరి ప్రథమ బహుమతిని కూడా సొంతం చేసుకున్నారు. తన నడకతో 19 ఏళ్ల యువతీ యువకులు సైతం ఈర్ష్య పడేలా చేశాడు. మరి..ఈ తాత జీవన విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.