ఇటీవల కాలంలో సినీ, రాజకీయ వర్గాలకు చెందిన వారు సోషల్ నెట్ వర్క్ ను బాగా వాడుకుంటున్నారు. ముఖ్యంగా రాజకీయ నేతలు సోషల్ మాద్యమాల వాడకం బాగా పెంచుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఏ వార్త అయినా క్షణాల్లో జనాల్లోకి చేరువ అవుతుంది.. దీనికి పెద్ద ఖర్చు కూడా చేయాల్సిన అవసరం ఉండదు. కొంత మంది తమ ప్రత్యర్థులను టార్గెట్ చేయాలంలో ఒక్క చిన్నరూమర్ సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తే చాలు అని భావిస్తున్నారు. ఇదిగో పులి అంటే.. అదిగో తోక అన్న చందంగా సోషల్ మీడియాలో రూమర్లు ఇట్టే వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నిజమా? కాదా? అన్న విషయం తెలుసుకునే లోపు జరగాల్సిన అనర్ధాలు, నష్టాలు జరిగిపోతూనే ఉంటాయి. సినీ, రాజకీయ నేతలపై ఇలాంటి రూమర్లు సర్వసాధారణం అయ్యాయి.
నారా లోకేష్ సతీమణి, బాలకృష్ణ కూతురు బ్రాహ్మణిపై సోషల్ మీడియాలో ఒక వార్త తెగ చక్కర్లు కొడుతుంది. హైదరాబాద్ మేడ్చల్ దగ్గర దివంగత సీఎం జయలలిత కు సంబంధించిన ఓ ఫామ్ కు జేజే గార్డెన్ అని పేరు ఉండేది. ప్రస్తుతం ఆ పేరు మారిపోయి వేరొక పేరు దర్శనం ఇస్తుంది. దాంతో మొన్నటి వరకు ఆ దారినపోయేవారు బోర్డును చూసి ఆశ్చర్యపోతున్నారు. జయలలిత కు సంబంధించిన ఫామ్ హౌజ్ ని ఎవరో కొనేశారని అనుకుంటున్నారు. అయితే జయలిత ఫామ్ హౌజ్ ని నారా బ్రాహ్మణి రూ.1600 కోట్లకు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయంపై కొంతమంది ట్రోల్ చేయడంతో ఇందులో ఏమాత్రం నిజం లేదని.. కావాలని కొంత మంది గిట్టని వారు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ అంటుంది.
ఇది కొంత మంది ప్రత్యర్థి పార్టీవాళ్లు కావాలని సృష్టిస్తున్న ప్రచారాలు అని.. ఇదంతా తప్పుడు ప్రచారం అని ఫ్యాక్ట్ చెక్ టీడీపీ అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్విట్ చేసింది. అయితే ఆ ట్వీట్ ను టీడీపీ తన అధికారిక ఖాతా ద్వారా రీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఏపిలో టీడీపీ బాగా పుంజుకుంటుందని.. ఈ క్రమంలోనే ప్రత్యర్థి పార్టీ వారు రక రకాల కుట్రలు.. కుతంత్రాలు పన్నుతున్నారని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. బ్రాహ్మణిపై ఉద్దేశపూర్వకంగానే కొంత మంది లేని పోని అసత్య ప్రచారాలు చేస్తూ మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుంది.
జయలలిత కు సంబంధించిన ఫామ్ హౌజ్ ని కొనుగోలు చేసిన కంపెనీ వారు నారా బ్రాహ్మణికి తెలిసిన వారని.. అందుకే ఆమెను టార్గెట్ చేశారని మరో ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా ఇప్పుడు ఈ విషయం ఏపిలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కాలంలో ట్విటర్ వేధికగా అధికార, ప్రతిపక్షాల మద్య ట్విట్టర్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ఇలాంటి పుకార్లు సృష్టించి ఉంటారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
గతంలో కూడా హైదరాబాద్ లోని జయలలిత ఆస్తుల వ్యవహారంపై రక రకాల చర్చలు జరిగాయి. ఇప్పుడు ఈ వ్యవహారంలో నారా బ్రాహ్మణి పేరు తెరపైకి రావడం అనేది రాజకీయాంగా చర్చనీయాంశం అయ్యింది. ఏది ఏమైనా సెలబ్రెటీలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతాయని గ్రహించిన వారు ఇలాంటి రూమర్ సృష్టించి ఉండొచ్చని భావిస్తున్నారు. దీన్ని బట్టి ఈ ప్రచారంలో వాస్తవం లేదని పలువురు నెటిజన్లు అనుకుంటున్నారు.
@ysjagan రూ.1600 కోట్ల విలువైన దివంగత సీఎం జయలలిత
ఫాం హౌస్ కొన్న నిరుపేద “నారా బ్రాహ్మణి”— Ramesh Babu Vippa3 (@RameshBabuVipp3) October 25, 2022
రూ.1600 కోట్ల విలువైన దివంగత సీఎం జయలలిత
ఫాం హౌస్ కొన్న నిరుపేద చంద్రబాబు కోడలు “నారా బ్రాహ్మణి”— Anitha Reddy (@Anithareddyatp) October 24, 2022
సిగ్గు ఉండాలిర ఇంటూరి, ఇలా తప్పుడు పోస్ట్లు వేస్తూ డబ్బులు సంపాదించుకోవడానికి. @PoliticalPunch9 pic.twitter.com/uqoFaRzQnc
— @Fact Check TDP (@fakeyoucp) October 25, 2022