అన్ని మార్గాల్లో ప్రయాణిస్తూ.. సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతుంది బస్సు. అందుకే తెలంగాణ ప్రభుత్వం.. బస్సులో ప్రయాణం చేయాలని సూచిస్తుంటుంది. అంతే కాకుండా ఆదాయాన్ని పెంచే అనేక మార్గాలను అన్వేషిస్తుంది. ప్రయాణీకులకు అందుబాటు ధరల్లో, అనువుగా, సుఖవంతమైన ప్రయాణాన్ని అందించడమే ధ్యేయంగా ఇటీవల పలు రకాల పథకాలను ప్రవేశ పెట్టింది.
ఆఫీసులకు సకాలంలో వెళ్లాలన్నా, బడులకు ఠంచనుగా హాజరు కావాలన్నా, చిన్న చిన్న దూరాలకు వెళ్లాలన్నా బస్సులోనే ప్రయాణిస్తుంటారు చాలా మంది. సొంత వాహనాలు లేకుంటే ఏ ప్రాంతానికైనా వెళ్లగలిగే వాహనం ఏదైనా ఉందంటే అది బస్సే. అన్ని మార్గాల్లో ప్రయాణిస్తూ.. సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం.. బస్సులో ప్రయాణం చేయాలని సూచిస్తుంటుంది. అంతే కాకుండా ఆదాయాన్ని పెంచే అనేక మార్గాలను అన్వేషిస్తుంది. ప్రయాణీకులకు అందుబాటు ధరల్లో, అనువుగా, సుఖవంతమైన ప్రయాణాన్ని అందించడమే ధ్యేయంగా ఇటీవల పలు రకాల పథకాలను ప్రవేశ పెట్టింది. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే కొన్ని బస్సులకు రాయితీలు ఇవ్వడమే కాకుండా స్నాక్స్ అందించే ప్రణాళికను అమలు చేసింది. అదేవిధంగా మహిళలకు, సీనియర్ సిటిజన్స్ ను ఉద్దేశించి ఇటీవల పలు టికెట్లను తీసుకువచ్చిన సంగతి విదితమే.
ఇప్పుడు మరో శుభవార్తతో మన ముందుకు వచ్చింది టీఎస్ఆర్టీసీ. మహిళలు, వయోజనులు, ఉద్యోగస్థులకే కాకుండా సాధారణ ప్రయాణీకులను దృష్టిలో పెట్టుకుని పాస్లు ఇవ్వనుంది. తక్కువ దూరం ప్రయాణించే వారికి రూట్ పాస్లను అందించనుంది. దీని వల్ల వారికి లబ్ది చేకూరుతుందని ఆశిస్తుంది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోని 162 రూట్లలో ఈ పాస్లను జారీ చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. రూ.600తో ఆర్డీనరీ పాస్, రూ. 1000తో మెట్రో పాస్గా ధరలను నిర్ణయించారు.. ఈ పాస్ సాయంతో నిర్ణీత రూట్లో 8 కిలోమీటర్ల దూరంలో రోజుకు ఎన్నిసార్లయినా రాకపోకలు సాగించవచ్చని ఆర్జీసీ వెల్లడించింది. ఈ పాస్ల ద్వారా సగం ధరకే రోజూ రాకపోకలు సాగించవచ్చని పేర్కొంది. ఆర్టీసీ వెబ్సైట్, బస్ పాస్ కౌంటర్ల వద్ద సంప్రదించాలని అధికారులు తెలిపారు.