రాజకీయ నాయకులు అంటే.. ఎన్నికల సమయంలో జనాల వద్దకు రావడం.. హామీలు ఇవ్వడం.. ఆ తర్వాత కనుమరుగు కావడం.. ఇదే టాక్ జనాల్లో ఉంది. గెలిచిన తర్వాత నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడరు చాలా మంది నేతలు. జనాలతో తమకు సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్లు భావిస్తారు. కానీ కొందరు నాయకులు మాత్రం ప్రజల బాగోగుల గురించి ఆలోచిస్తారు. ఈ కోవకు చెందిన వ్యక్తే రామగుండం టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ప్రజలు బాగుండాలని కోరుకుంటూ.. నిప్పుల మీద నడిచారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 59 కే రోజంతా ప్రయాణం
అంతర్గాం మండలానికి పూర్వ వైభవం తీసుకువస్తానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గురువారం అంతర్గాం మండల కేంద్రంలోని శ్రీ నూకాంబిక అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. రామగుండం ప్రజానీకం బాగుండాలని దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన అగ్నిగుండం నిప్పులపై ఎమ్మెల్యే చందర్ నడిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రామగుండం ప్రజలకు మరింత సేవచేసే శక్తిని శ్రీ నూకాంబిక అమ్మవారు ప్రసాదించాలని వేడుకున్నాను అని తెలిపారు.
ఇది కూడా చదవండి: మాస్క్ ధరించాలా? వద్దా? క్లారిటీ ఇచ్చిన డీహెచ్ శ్రీనివాస్
అంతర్గాం కు తిరిగి పూర్వ వైభవం తీసుకువస్తానన్నారు. రామగుండం ప్రజలకు ఆగస్టు మాసంలో మెడికల్ కళాశాల సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. నూకాంబిక అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఎమ్మెల్యే చందర్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేనయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.