జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక ఆధారాలు బయటపెట్టారు. అయితే గ్యాంగ్ రేప్ బాధితురాలి ఫొటోలు, వీడియోలు బయటపెట్టారంటూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారంట. ఈక్రమంలో ఎమ్మెల్యే రఘనందన్ రావుకి చాలామంది సోషల్ మీడియా ద్వారా తమ మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే గ్యాంగ్ రేప్ కేసు విషయంలో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ వ్యవహారంపై ఆయన ట్వీట్ చేశారు.
“జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు విషయంలో ఓ సామాన్యుడిలా ఆలోచిస్తే కేవలం రఘునందనరావు మాత్రమే వాస్తవికంగా మాట్లాడుతున్నట్లు అనిపిస్తోంది. మిగతా వారంతా కేసును పక్కదారి పట్టించే కుతంత్రాలు చేస్తున్నారు. ఇది విచారకరం” అంటూ వర్మ ట్వీట్ చేశారు. ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది. చాలామంది నెటిజన్లు రీట్వీట్ చేస్తున్నారు. కొందరు వర్మ వ్యాఖ్యలు సపోర్టు చేస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. మరి.. ఆర్జీవీ చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
As far as the Jubilee Hills gang rape case is concerned, it seems to me as a common man that only @RaghunandanraoM seems to be truthful to the point and all others are using diversion tactics ..SAD
— Ram Gopal Varma (@RGVzoomin) June 7, 2022
ఇదీ చదవండి: బీజేపీ పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత.. SI ని తోసేసిన సోము వీర్రాజు