భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది తొలిసారిగా తెలంగాణ రాష్ట్రాన్ని పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొనబోతున్నారు. రాష్ట్రంలో మొత్తం రూ.11,355 కోట్ల విలువైన అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టనున్నారు ప్రధాని మోదీ.
భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబద్ పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొనబోతున్నారు. ఈ ఏడాది తెలంగాణకు మొదటిసారిగా వస్తున్నారు. తన పర్యటనలో మొత్తం రూ.11,355 కోట్ల విలువైన అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టనున్నారు ప్రధాని మోదీ. ఇందులో కొన్ని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి చేరుకున్నారు. సికింద్రబాద్ – తిరుపతి మద్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఉదయం 11.55 కి పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
ఇదిలా ఉంటే.. ఈసారి కూడా ప్రధాని మోదీ పర్యటనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉంటున్నట్టు సమాచారం. అయితే రాష్ట్రానికి ప్రధాని మోదీ వస్తున్న సందర్భంగా ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు ఆహ్వానం పలికేందుకు సీఎం వెళ్లాల్సి ఉండగా.. ఆయన స్థానంలో ప్రభుత్వం తరుపు నుంచి మోదీకి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర గవర్నర్ తమిళసై స్వాగతం పలికారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు పూర్తయిన తర్వాత పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. ప్రస్తుతం తెలంగాణ పరిస్థితుల పై ప్రధాని ఎలా స్పందిస్తారో అన్న విషయంపై హాట్ టాపిక్ గా మారింది. ఇక పర్యటన పూర్తయ్యా ప్రధాని మోదీ.. మధ్యాహ్నం 1.30కి తిరిగి బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీ వెళ్తారు.
హైదరాబాద్కు బయలుదేరి అక్కడ సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించి, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభించడం లేదా వాటి శంకుస్థాపనలు చేయడం జరుగుతుంది. https://t.co/3UPLRXhk5k
— Narendra Modi (@narendramodi) April 8, 2023