పేద వారు కూడా ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్ల పథకాన్ని తీసుకువచ్చింది. దీనిలో భాగంగా నగరంలో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తున్నారు. ఇక తాజాగా డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టాలీవుడ్లో ఇప్పుడు నంది అవార్డుల అంశం వివాదాస్పదంగా మారింది. కొన్నేళ్లుగా ఈ పురస్కారాలు ఇవ్వకపోవడంతో పలువురు సినీ ప్రముఖులు ఈ అంశంపై ఇటీవల పెదవి విప్పారు. అవార్డుల మీద అనేక అపోహలు ఉన్నాయని చెప్పారు. తాజాగా ఈ వివాదంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.
హైదరాబాద్ లో భక్తులు దర్శించుకోవడానికి ఎన్ని ఆలయాలు ఉన్నా.. ముందుగా గుర్తుకు వచ్చేది బల్కం పేట ఎల్లమ్మ గుడి. భక్తుల కొంగు బంగారమైన ఎల్లమ్మతల్లిని నిత్యం భక్తులు దర్శించుకుంటూనే ఉంటారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది తొలిసారిగా తెలంగాణ రాష్ట్రాన్ని పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొనబోతున్నారు. రాష్ట్రంలో మొత్తం రూ.11,355 కోట్ల విలువైన అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టనున్నారు ప్రధాని మోదీ.
తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన మనవడితో కలిసి హోలీ సంబరాలు జరుపుకున్నారు. తాతమనవళ్లు ఇద్దరూ పరస్పరం రంగులు విరజిమ్ముకుంటూ తెగ ఎంజాయ్ చేశారు.
ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రోత్సాహకంగా ప్రభుత్వాలు ఆయా పథకాల పేరుతో కొంత డబ్బుని ఇస్తుంటాయి. కుల వృత్తులు, చేతి వృత్తులు ఆధారంగా వివిధ పథకాల ద్వారా డబ్బుని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గొర్రెల పంపిణీ పథకంలో చేరిన లబ్దిదారులకు గొర్రెలు స్వయంగా కొనుగోలు చేసుకునేందుకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో ఉన్న లబ్ధిదారులకు […]
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో మంగళవారం ఉదయం నుంచి ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఆయన ఇళ్లతో పాటు కాలేజీలు, బంధువుల ఇళ్లలో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. మల్లారెడ్డి ఇళ్లపై ఐటీ దాడులను తప్పు బట్టారు. కేంద్రం తాటాకు చప్పుళ్లకు తాము భయపడమని అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో హైదరాబాద్కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై వారు చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి […]
సికింద్రాబాద్ లో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. ఓ భవంతిలో మంటలు వ్యాపించి ఎనిమిది మంది ప్రణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 10 మందికి గాయాలుఅయ్యాయి. లాడ్జిలో బస చేస్తున్న వీరు అగ్నిప్రమాదం కారణంగా ఊపిరాడక మరణించారు. ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఎలక్ట్రిక్ షోరూమ్ లో సంభవించిన అగ్నిప్రమాదం కారణంగానే వీరు మరణించారు. వివరాల్లోకి వెళ్తే.. మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘోరం […]
వినాయక చవితి పండగను దేశమంతటా ఎంతో ఘనంగా నిర్వహించారు. సినిమా సెట్టింగ్ లను తలపించేలా గణనాధుడి మండపాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంలో కూడా వినాయక చవితి పూజలు ఎంతో ఆడంబరంగా జరుగుతోన్నాయి. అదే విధంగా నగరంలో పలు చోట్ల అప్పుడే నిమజ్జనం కూడా చేస్తున్నారు. అయితే వాహనం ఎక్కి వినాయకుడు నిమజ్జనానికి తరలడం కాదు.. నిమజ్జన వాహనమే ఇంటి ముందుకు వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సరికొత్త విధానానికి ఫ్రీడమ్ ఆయిల్ కంపెనీ నాంది పలికింది. […]
ఢిల్లీ మద్యం అక్రమాల్లో తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ప్రమేయం ఉందంటూ బీజేపీ ఎంపీలు ఆరోపణలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అంతేకాకుండా బీజేపీ కార్యకర్తలు కవిత ఇంటిని ముట్టడించడం, దాడికి యత్నించారంటూ తెరాస నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్లు, తెరాస కార్యకర్తలు ఎమ్మెల్సీ కవితను కలిసి సంఘీభావం తెలిపారు. కవితను కలిసిన తర్వాత తలసాని మీడియాతో మాట్లాడారు. “ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలను పట్టుకుని ఇవాళ […]