ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు బాగా పెరిగిపోయాయి. చిన్న, పెద్దా అన్న తేడా లేకుండా అందరినీ బలి తీసుకుంటున్నాయి. తాజాగా, ఓ గర్భిణి గుండెపోటుకు బలైంది.
గుండెపోటు.. నేడు దేశ వ్యాప్తంగా ఉన్న వారందరినీ తీవ్రంగా భయపెడుతోంది. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా అందరినీ గుండెపోట్లు బలితీసుకుంటున్నాయి. సంవత్సరాల పిల్లల్ని కూడా కబళిస్తోంది. నిత్యం ఎక్కడో చోట ఎవరో ఒకరు గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా, ఓ నిండు గర్భిణి గుండెపోటుకు బలైంది. ఈ సంఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే… పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్కు చెందిన సమత గర్భంతో ఉంది. ఆదివారం ఆమెకు ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది.
దీంతో ఆమెను ఆదివారం కరీంనగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటుతో మరణించిందని నిర్ధారించారు. ఆలస్యం కారణంగానే సమత మృతి చెందిందని బంధువులు ఒకరితో ఒకరు గొడవ పడ్డారు. వైద్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గొడవ పడుతున్నవారిని సముదాయించి అక్కడినుంచి పంపేశారు. మరి, విపరీతంగా పెరిగిపోయిన గుండెపోటు మరణాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.