తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా ఖమ్మం రాజకీయాల్లో కీలకంగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. తాజాగా ఆ పార్టీలో చేరి నా గొంతు నేను కోసుకోలేనంటూ ఓ పార్టీ ని ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లా కేంద్రం రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఖమ్మం రాజకీయాల్లో కీలకంగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాస రెడ్డి వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. ఇటీవలే బీఆర్ఎస్ అధిష్టానం పొంగులేటి శ్రీనివాస రెడ్డిని, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులపై వేటు వేసింది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండైన పొంగులేటి ఇప్పుడు ఏ పార్టీలోకి చేరుతారని అందరిలో ఓ ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఓ పార్టీని ఉద్దేశిస్తూ ఆయన తన గొంతు తాను కోసులేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి.. అదే ఏ పార్టీ, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఖమ్మం జిల్లాకు చెందిన కీలక రాజకీయ నేతల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకరు. 2014లో వైసీపీ తరపున ఖమ్మం ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో పొంగులేటికి కాదని నామా నాగేశ్వరావుకు ఎంపీగా పోటీ చేసే అవకాశం బీఆర్ఎస్ అధిష్టానం ఇచ్చింది. ఇక తరువాత కొంతకాలానికి బీఆర్ఎస్ అధినేతకు, పొంగులేటికి మధ్య గ్యాప్ ఏర్పడింది. దీంతో అవకాశం వచ్చిన ప్రతిసారీ అధిష్టానంపై ధిక్కారస్వరం వినిపిస్తూ వచ్చేవాడు.
అంతేకాక ఖమ్మంలోని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనం జరుపుతూ అధిష్టానానికి పంటికింద రాయిలా మారాడు. పొంగులేటి వ్యవహార శైలి పరిశీలిస్తూ వచ్చిన బీఆర్ఎస్ అధిష్టానం ఎట్టకేలకు వేటు వేసింది. ఒకవిధంగా చెప్పాలంటే ఈరోజు కోసం పొంగులేటి కూడా ఎదురుచూస్తున్నారనేది నమ్మలేని సత్యం. అయితే బీఆర్ఎస్ వేటుతో పొంగులేటి అడుగులు ఏ పార్టీ వైపు పడతాయన్నది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. బీజేపీ లేదా కాంగ్రెస్ లో చేరుతారంటూ ప్రచారాలు జరిగాయి. అలానే షర్మిల పార్టీలో చేరుతారని కూడా ప్రచారం జరిగింది. కొన్నిరోజుల క్రితం వైఎస్ విజయమ్మను పొంగులేటి కలవడంతో ఆ వార్తకు బలం చేకూరింది.
ఇక తాజాగా షర్మిల పార్టీలో చేరికపై పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వైఎస్సార్ టీపీలో చేరడం లేదని పొంగులేటి క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు మొహమాటానికి షర్మిల పార్టీలో చేరి తన గొంతు తాను కోసుకోలేనని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీలో చేరడం లేదని షర్మిలకు కోపం ఉండొచ్చని.. కానీ తాను ఏ ఉద్దేశ్యంతో బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చానో అలాంటి భావాలు ఉన్న పార్టీలో చేరుతానని ఆయన తెలిపారు. మరి.. పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.