‘జీవితంలో నాలుగు రాళ్లు వెనకేసుకునే వాడు గొప్పవాడు కాదూ నలుగురికి కడుపు నిండా అన్నం పెట్టినవాడే గొప్పవాడు’ అని పెద్దలు అంటుంటారు. అలానే మనల్ని అభిమానించే నలుగురు మనుషులను జీవితంలో సంపాదించుకుంటే అదే పెద్ద ఆస్తి అని అంటుంటారు. కానీ నేటి కాలంలో సాటీ మనిషికి ఆకలి తీర్చే వారు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. అలాంటి అరుదైన వ్యక్తులో ఓ పోలీసాయన ఉన్నారు. పెద్దల చెప్పిన మాటలు ఒంటపట్టించుకున్నాడో ఏమో కానీ నిత్యం నలుగురికి ఆకలి తీర్చనిదే ఆయనకి పొద్దు గడవదు. ఇక చెప్పాలంటే ఆయనే స్వయంగా ఆహారం వండి.. పేదలకు వడ్డించిన తర్వాత కానీ ఆయన భోజనం చేయరు. ఇంతకీ అంత గొప్ప మనిషి ఏవరు? ఆయన వివరాలు ఏమిటి? అని తెలుసుకోవాలని ఉంది కాదా? మరి.. ఆ వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కామారెడ్డి జిల్లాకు చెందిన బి. కోనారెడ్డి పోలీస్ శాఖలో ఎస్సైగా పనిచేస్తున్నారు. ఆయన కామారెడ్డి జిల్లాలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహించే బృందానికి అధికారిగా ఉన్నారు. కోనారెడ్డి రెండేళ్లుగా పెట్రోలింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆ రహదారిపై దూర ప్రాంతాలకి కాలినడకన వెళ్లే పేదలను చూసి కోనారెడ్డి మనస్సు చలించింది. దీంతో తనకు చేతనైనంతగా నిత్యం కొందరికి ఆకలి తీర్చాలని నిర్ణయించుకున్నారు. అలా తనకు వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టిన కోనారెడ్డి.. ప్రతిరోజూ ఆ జాతీయ రహదారి వెంట వెళ్తున్న పేదలకు కడుపు నిండా భోజనం పెడుతున్నారు. తనకు డ్యూటీ లేని రోజూ కూడా పేదలకు ఆహారం అందించే వారు. కామారెడ్డి టౌన్ లోని సీఎస్ఐ గ్రౌండ్ కి సమీపంలో ఉండే పేదలకు భోజనం అందించేవారు. మానసిక వికలాంగులకి అయితే ఆయనే స్వయంగా అన్నం కలిపి తినిపిస్తుంటారు.
ఇలా నిత్యం అనేక మందికి అన్నం పెట్టిన తరువాతే ఆయన భోజనం చేసేవారు. ఇక తన స్నేహితులు, బంధువుల దగ్గర వృథాగా ఉన్న దుస్తువులను సేకరించి పేదవారికి అందిస్తుంటారు. మానవసేవే..మాధవ సేవ అని బలంగా నమ్మిన వ్యక్తిగా ఆయన ఎందరికో సాయం చేస్తూ ముందుగు సాగుతున్నారు. సాటి మనిషి ఆకలి తీర్చే అవకాశం, అదృష్టం మనుషులకే ఉందని ఆయన తెలిపారు. రహదారి వెంట కాలినడకన వెళ్లే వారికి, పేదలకు కడుపు నిండా అన్నం పెట్టడం తనకు ఎంతో సంతృప్తినిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. కాగా ఎస్సై కోనారెడ్డి ఔదార్యంపై తోటి ఉద్యోగులతో పాటు ఉన్నతాధికారులు అభినందలను తెలిజేయశారు. ఎస్సై కోనారెడ్డి చేసే ఈ మంచి పని మిగిలిన వారికి కూడా ఆదర్శమని స్థానికులు తెలిపారు.
ఇదీ చదవండి: కుమారుడు ఫారెస్ట్ ఆఫీసర్..తండ్రేమో కలప దొంగ..!
ఇదీ చదవండి: 18 వేల కోట్లతో రాజగోపాల్ రెడ్డిని బీజేపీ కొన్నది: KTR
ఇదీ చదవండి: కూటికిలేని స్థితి నుంచి కోట్లు.. చీకటి దందాతో ప్రముఖులకు చెమటలు