బీజేపీ ఫైర్బ్రాండ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఆయనపై నాంపల్లి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గతంలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, హోర్డింగ్లను చించివేయడం.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ని దుర్బాషలాడిన కేసు విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం.. ఈ కేసులో ఎంపీ అరవింద్ విచారణకు హాజరుకాని కారణంగా నాన్బెయిల్బుల్ వారెంట్ జారీ చేసింది.
2020 నవంబర్ 23వ తేదీన కేబీఆర్ పార్క్ దగ్గర ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి సంబంధించిన ఫ్లెక్సీలను, హోర్డింగ్లను ఎంపీ అరవింద్, అతని అనుచరులు చింపివేశారంటూ కేసు నమోదైంది.. అదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ని అనేక రకాలుగా తిడుతూ నానా దుర్బాషలాడారని ఫిర్యాదు చేశారు. అప్పట్లో టీఆర్ఎస్ సెక్రటరీగా ఉన్న ఇప్పటి ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చదవండి: టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ పై కేసు నమోదు!
ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఎంపీ అరవింద్, ఆయన అనుచరులపై చార్జిషీట్ దాఖలు చేశారు. కేసులో సాక్షులను కోర్టు విచారించింది. అయితే, ఆ కేసులో సాక్షుల విచారణ పూర్తై.. 313 ఎక్సమినేషన్ కి తప్పని సరి రావాల్సిన ఉన్నా.. అరవింద్ రాకపోవడంతో ఈ రోజు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు.. ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వెంటనే అరవింద్ ను అరెస్ట్ చేయాలంటూ కోర్టు పోలీసులకు సూచించింది. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.