చేతికి అందివచ్చిన కొడుకును కొల్పోయిన ఆ తల్లిదండ్రుల బాధ వర్ణాణాతీతం. చనిపోయిన కొడుకును తలచుకుంటూ గుండెలు పగిలేలా కన్నీరు పెట్టుకుంటోంది ఆ కన్నపేగు. నాకు వచ్చిన కడుపు కోత ఏ కన్న తల్లికి రాకూడదని నవీన్ తల్లి చెప్పుకొచ్చింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది నవీన్ హత్య కేసు. స్నేహితుడి చేతిలో అతి దారుణంగా హత్యకు గురైయ్యాడు బీటెక్ స్టూడెంట్ నవీన్. నిందితుడు హరిహర కృష్ణ అతి కిరాతకంగా అతడిని హత్య చేశాడు. నవీన్ తల, చేతి వేళ్లను, గుండెను తీసి ముక్కలు గా చేసి ఆ ఫోటోలను తన ప్రియురాలు నిహారిక రెడ్డి పంపించాడు. ఈ కేసుకు సంబంధించి పలు షాకింగ్ విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక చేతికి అందివచ్చిన కొడుకును కొల్పోయిన ఆ తల్లిదండ్రుల బాధ వర్ణాణాతీతం. చనిపోయిన కొడుకును తలచుకుంటూ గుండెలు పగిలేలా కన్నీరు పెట్టుకుంటోంది ఆ కన్నపేగు. నాకు వచ్చిన కడుపు కోత ఏ కన్న తల్లికి రాకూడదని ఆమె చెప్పుకొచ్చింది.
అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్యతో రాష్ట్రం మెుత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్నేహితుడు హరిహర కృష్ణ చేతిలో నవీన్ అతిదారుణంగా హత్యకు గురైయ్యాడు. నిహారికా రెడ్డికి తనకు మధ్యలో నవీన్ వస్తున్నాడని హరిహర కృష్ణ నవీన్ ను కిరాతకంగా హత్య చేశాడు. ఈ క్రమంలోనే చేతికి అందివచ్చిన చెట్టంత కొడుకు తమ మధ్యలో లేకుండాపోయే వరకు తట్టుకోలేకపోతున్నారు నవీన్ తల్లిదండ్రులు. ఇన నవీన్ తల్లి తన గుండెల్లో ఉన్న బాధను సుమన్ టీవీ ముందు బోరున విలపిస్తూ.. చెప్పుకొచ్చింది.
నవీన్ తల్లి మాట్లాడుతూ..”నా కొడుకు ఎవరికీ ఏ చిన్న హాని తలపెట్టడు.నాలాంటి కడుపుకోత ఏ తల్లికి కూడా రావొద్దు. ఎంత దారుణంగా ముక్కలు ముక్కలు చేసి చంపారు నా కొడుకును. ఎంత బాధ పడ్డాడో నా బిడ్డ. మరికొన్ని రోజులు అయితే కాలేజీ అయిపోద్ది అని చెప్పాడు. కానీ ఇప్పడు మా మధ్య లేకుండా పోయాడు. ఆ రాక్షసుడు నా కొడుకు బదులుగా నన్ను చంపినా బాగుండు” అని కన్నీరు మున్నీరు అవుతూ చెప్పుకొచ్చింది. వారిద్దరికి ఉరి శిక్ష విధించాలని, లేకపోతే నేను నా కొడుకు చనిపోయిన ప్రదేశంలోనే చనిపోతానని నవీన్ తల్లి హెచ్చరించారు.
ఇక పోలీసులు వారికి కచ్చితంగా శిక్ష పడుతుందని చెప్పడంతోనే మేము తిరిగి వచ్చామని ఆమె ఈ సందర్భంగా అన్నారు. చిన్న పిల్లలు ఏది చెప్పినా వినే నా కొడుకును ఇలా దారుణంగా ముక్కలు చేసి చంపడం తట్టుకోలేక పోతున్నాను అని మాట్లాడినంతసేపు బోరున విలపిస్తూనే ఉంది ఆ కన్నపేగు. నాకు వచ్చిన కడుపు కోత ఏ కన్న తల్లికి రాకూడదని చెప్పుకొచ్చింది. ఆ కన్నతల్లి కన్నీరు ప్రతీ ఒక్కరి హృదయాలను ద్రవింపజేస్తోంది.