ఆరేళ్లుగా యాదాద్రి నరసింహుని దివ్వదర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న భక్తులకు మార్చి 28 నుంచి ఆ భాగ్యం కలగనుంది. మార్చి 28 న నిర్వహించే మహాకుంభ సంప్రోక్షణ తర్వాత నుంచి భక్తులకు యాదాద్రి నృసింహుడు నిజరూప దర్శనం ఇవ్వనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యాదాద్రి పంచ నారసింహ క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా పునర్నిర్మించింది. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే రీతిలో వివిధ ఆలయాల శిల్పకళా శైలీవిన్యాసాలన్నీ ఒకేచోట కొలువుదీరేలా ప్రపంచస్థాయి క్షేత్రంగా ఈ దివ్యధామాన్ని నేత్రపర్వంగా తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిభక్తునిగా సోమవారం పూజలు జరిపించిన తర్వాత భక్తులకు నరసింహుని దర్శనం లభించనుంది.
ఇది కూడా చదవండి: యాదాద్రి ఆలయానికి ఎవరు ఎన్ని కిలోల బంగారం ఇచ్చారో తెలుసా
యాదాద్రి ఆలయ నిర్మాణం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. ఆలయ నిర్మాణంలో ముస్లిం శిల్పులు కూడా భాగమయ్యారు. సర్వాంగ సుదరంగా పునర్నిర్మాణమైన యాదాద్రి క్షేత్రం భక్తులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. యాదాద్రి పునర్మిర్మాణంలో గుంటూరు జిల్లా, మేడికొండూరు మండలం, తురకపాలెం గ్రామానికి చెందిన 60 మందికి పైగా ముస్లిం కళాకారులు పాల్గొన్నారు. తురకపాలెం గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. తమ అద్భుత శిల్ప కళా నైపుణ్యంతో ఒడిశా నుంచి తెలంగాణ వరకు వందల ఆలయాలను అందంగా రూపొందించిన ఘనత వీరికి దక్కుతుంది.
ఇది కూడా చదవండి: ‘మన్ కీ బాత్’ లో సికింద్రాబాద్ మెట్ల బావిని ప్రశంసించిన ప్రధాని..శిల్పాలను చెక్కడంలో సిద్ధహస్తులైన వందలమంది కళాకారులు తురకపాలెం గ్రామంలో ఉన్నారు. వీరు చర్చిలు, మసీదుల నిర్మాణ పనులు కూడా చేస్తుంటారు. తమ పూర్వీకుల నుంచి ఈ కళ తమకు అబ్బిందని వీరు చెబుతున్నారు. యాదాద్రి ఆలయ రాజగోపురం సహా అనేక ముఖ్య నిర్మాణాల్లో కీలక పాత్ర పోషించినట్లు వీరు చెబుతున్నారు. క్రిష్ణ శిలలను కళా రూపాలుగా మార్చి.. ఏడంతుస్తుల మహా రాజగోపురం సిద్ధం చేశామని.. వివిధ మండపాలను అందంగా తీర్చిదిద్దామని తెలిపారు. యాదాద్రి ఆలయ నిర్మాణానికి వినియోగించిన కృష్ణ శిలలను కోటప్ప కొండ ప్రాంతం నుంచి తరలించినట్లు వారు తెలిపారు. ముస్లింలు అయినప్పటికి హిందూ మత, సంప్రాదాయ, ఆచారాలను పాటిస్తూ.. ఆలయ నిర్మాణంలో భాగం అయ్యామని వారు చెబుతున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: సూటు, బూటుతో రోడ్డు పక్క ఫుడ్ స్టాల్కు..