ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితని ఈడీ అధికారులు దాదాపు 9 గంటల పాటు విచారించారు. అయితే ఆమెని అడిగిన 20 ప్రశ్నలు ఇవేనని తెలుస్తోంది. ఇంతకీ అవేంటంటే?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత ఈడీ తాజా విచారణ ముగిసింది. శనివారం ఉదయం 11 గంటలకు ఈ విచారణ మొదలుకాగా.. దాదాపు 9 గంటలకుపైగా అంటే రాత్రి 8 గంటల వరకు అది కొనసాగింది. సాయంత్రం 5:30 గంటలకే విచారణ పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ.. సడన్ గా ఆ సమయాన్ని అధికారులు పెంచేశారు. రూల్ ప్రకారం అయితే సాయంత్రం 6 గంటలకే కవిత విచారణ ముగియాల్సింది. కానీ లేట్ కావడంతో కవిత అరెస్ట్ తప్పదా అని బీఆర్ఎస్ శ్రేణులు కంగారు పడ్డాయి. అయితే ఆమె బయటకు రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కవిత బయటకు రావడానికి ముందు ఈడీ ఆఫీస్ దగ్గర నుంచి పార్టీ శ్రేణుల్ని దూరంగా పంపించేశారు.
ఇక విషయానికొస్తే.. కవితని శనివారం 9 గంటలపాటు విచారించిన ఈడీ అధికారులు, ఈ నెల 16న మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. తాజాగా జరిగిన ఎంక్వైరీలో పూర్తిగా కవిత మొబైల్ ఫోన్లు ధ్వంసం చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలు, స్కామ్ లో సౌత్ గ్రూప్ పాత్రపై విచారించారని తెలుస్తోంది. అరుణ్ పిళ్ళై రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా కవితపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా విచారణలో మాత్రం కవితని ఏమేం ప్రశ్నలు అడిగారనేది కాస్త ఇంట్రెస్టింగ్ గా మారింది. కవితని అడిగిన ప్రశ్నలు ఇవేనంటూ కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి అనేది ఇప్పుడు చూద్దాం. అలానే ఈ ప్రశ్నలన్నీ కూడా సమచారం మాత్రమే. మరోసారి విచారణకు రావాలని ఆదేశించిన నేపథ్యంలో ఏం జరుగుతుందోనని అందరూ మాట్లాడుకుంటున్నారు.