తెలంగాణాకు తలమానికంలా నిలిచే మేడారం జాతర ఫిబ్రవరి 16న ప్రారంభమైన సంగతి తెలిసిందే. తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో సమ్మక్క-సారలమ్మ జాతర కొనసాగుతుంది. తాజాగా వన దేవతలకు కేటీఆర్ నిలువెత్తు బంగారం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. సిరిసిల్ల జిల్లా ఓబుళాపూర్లో జరుగుతున్న సమ్మక – సారలమ్మ జాతరను కేటీఆర్ సందర్శించారు.
ఈ సందర్బంగా వన దేవతలకు కేటీఆర్ నిలువెత్తు బంగారం సమర్పించి, మొక్కులు చెల్లించుకొని.. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా జాతరకు వచ్చిన భక్తులను కేటీఆర్ పలకరించారు. కేటీఆర్తో సెల్ఫీలు దిగేందుకు కొంత మంది యువతీ యువకులు పోటీ పడ్డారు. మంత్రికి కరచాలనం ఇచ్చేందుకు భక్తులు ఆసక్తి చూపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.
ఇది చదవండి: విద్యార్థులకు స్వయంగా వడ్డించిన సీఎం జగన్!
అంతకుముందు కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో రైతు వేదిక సందర్భంగా మాట్లాడారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో కేటీఆర్ రైతు వేదికను ప్రారంభించి ప్రసంగించారు. అంతకుముందు కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో రైతు వేదిక సందర్భంగా మాట్లాడారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల నాణ్యమైన విద్యుత్ను రైతులకు ఇస్తున్నామని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు గోదావరి జలాలు తరలి రావడంతో ఒకట్రెండు కాదు.. 6 మీటర్లు భూగర్భ జలాలు మీదకు వచ్చాయి అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఓబులాపూర్ లో జరుగుతున్న సమ్మక్క – సారలమ్మ జాతరకు హాజరై వన దేవతలను దర్శించుకున్న మంత్రి శ్రీ @KTRTRS. pic.twitter.com/KExe8bGpsx
— TRS Party (@trspartyonline) February 18, 2022