కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం వరుస పెట్టి ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో గతంలో ఇచ్చిన హామీలను త్వరితగతిన పూర్తి చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.
కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం వరుస పెట్టి ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో గతంలో ఇచ్చిన హామీలను త్వరితగతిన పూర్తి చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. గతంలో బీడీ, మైనార్టీలకు లక్ష రూపాయల పథకాన్ని అమలు చేసింది. అదేవిధంగా బీడీ కార్మికులకే కాకుండా బీడీ టేకేదార్లకు కూడా ఆసరా పెన్షన్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేసేందుకు ఇటీవల కేబినేట్ సమావేశంలో చర్చలు కూడా జరిపింది కేసీఆర్ నేతృత్వంలోని మంత్రి వర్గం. అలాగే దివ్యాంగులకు కూడా శుభవార్త చెప్పింది. గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు 5శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
తాజాగా మరో హామీని అమలు చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. తెలంగాణ ప్రజలకు మంత్రి కేటీఆర్ శుభవార్త తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒకటైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తైన నేపథ్యంలో లబ్దిదారులు అందించనున్నట్లు బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రకటించారు. ఆగస్టు 15 నుండి అనగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇళ్ల పంపిణీ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్లో సుమారు లక్ష మంది లబ్దిదారులకు ఆగస్టులోగా ఇళ్లను పంపిణీ చేస్తామని తెలిపారు. ఇళ్లు పూర్తయ్యాయని, మేము అలాట్ మెంట్ చేసుకుని, నియోజకవర్గానికి 4 వేలు చొప్పున పంపిణీ చేస్తామని తెలిపారు. గృహలక్ష్మి పథకం కింద కూడా రూ. 3 లక్షలు అందిస్తామని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ చేస్తామన్న మాట కేటీఆర్ నుండి బయటకు రాగానే.. ఆనందంలో మునిగి తేలుతున్నారు హైదరాబాద్ వాసులు. ఇప్పటికే రెండు దఫాలుగా అధికారంలో కొనసాగుతుంది బీఆర్ఎస్. ఈ సారి కూడా తామే అధికారంలోకి రావాలని ఊవిళ్లూరుతుంది.