తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్రాభివృద్ది కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు కేటీఆర్. రాష్ట్రంలో ఐటీ విస్తరణ..పెట్టుబడుల ఆకర్షణలో తనదైన సత్తా చూపిస్తున్నారు. అంతేకాదు కష్టాల్లో ఉన్నవారికి సొంతమనిషిలా ఆదుకుంటారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ అభివృద్ది.. పేదల ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకు వచ్చి ప్రజల మన్ననలు పొందిన ఆయన రెండోసారి కూడా సీఎం గా ఎన్నికయ్యారు. ఆయన తనయుడు కేటీఆర్ సైతం రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్రాభివృద్ది కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు కేటీఆర్. రాష్ట్రంలో ఐటీ విస్తరణ..పెట్టుబడుల ఆకర్షణలో తనదైన సత్తా చూపిస్తున్నారు. అంతేకాదు కష్టాల్లో ఉన్నవారికి సొంతమనిషిలా ఆదుకుంటారు. తాజాగా ఓ దివ్యాంగుడి కల నెరవేర్చి మరోసారి తన మంచితనాన్ని నిరూపించుకున్నారు కేటీఆర్. వివరాల్లోకి వెళితే..
రెండు రోజుల క్రితం.. ఫిబ్రవరి 28న ఎల్లారెడ్డిపేటలో వృద్దుల డే కేర్ సెంటర్ ప్రారంభించడానికి వెళ్లారు మంత్రి కేటీఆర్. ఈ సందర్బంగా నారాయణపూర్ కు చెందిన ఆకారపు నర్సయ్య మంత్రి కేటీఆర్ ని కలిశారు. నర్సయ్యకు చిన్నప్పుడే రెండు కాళ్లు వంకరగా మారిపోయాయి. చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు… ఆయన సతీమణి కూడా సహాయం చేస్తూ వచ్చింది. ఈ మద్యనే నర్సయ్య భార్య చనిపోయింది. దీంతో ఇద్దరు కూతుళ్లు మాధురి, గౌతమి లను పోషించుకుంటూ కష్టంగా జీవితాన్ని ఎల్లదీస్తున్నాడు. ఈ క్రమంలో ఎల్లారెడ్డిపేటలో వృద్దుల డే కేర్ సెంటర్ ని ప్రారంభించడానికి వచ్చిన మంత్రి కేటీఆర్ ని బీఆర్ఎస్ సిరిసిల్లా జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సహకారంతో కలిసి తన కష్టాల గురించి చెప్పుకొని ఆటో ఇప్పిస్తే నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటానని అన్నాడు.
నర్సయ్య కష్టాలు విన్న మంత్రి కేటీఆర్ వెంటనే చలించిపోయాడు. కుటుంబపోషణ కోసం అతనికి వెంటనే ఓ ఆటో మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో స్వయంగా చెప్పారు మంత్రి కేటీఆర్. ఈ క్రమంలో గురువారం ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ ఆఫీస్ లో కొత్త ఆటోను నర్సయ్యకు అందజేశారు. అన్నా కష్టాల్లో ఉన్నా అనగానే నేనున్నా అంటూ ముందుకు వచ్చి సహాయం చేస్తున్న మంత్రి కేటీఆర్ గొప్ప మనసు చాటుకున్నారని నర్సయ్య సంతోషం వ్యక్తం చేశారు. తన కూతుళ్లను ఆటోలో కూర్చోబెట్టుకొని కొద్దిసేపు తిప్పాడు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ.. ‘నా భార్య ఆరు నెలల క్రితం చనిపోయింది.. అప్పటి నుంచి నేను కష్టాల్లో ఉన్నాను. ఇలాంటి సమయంలో మంత్రి కేటీఆర్ అడిగిన 24 గంటల్లోనే నాకు ఆటో ఇప్పిచ్చిండు.. నేను బతికినంత కాలం ఆయనకు రుణపడి ఉంటా.. నాకు సహకరించిన వాళ్లందరికీ నా కృతజ్ఞతలు’ అని అన్నారు.