నిజ జీవితంలో కొన్ని విషయాలు, సంఘటనలే సినిమాలుగా వచ్చిన సందర్భాలు అనేకం. అలా వచ్చిన కొన్ని దృశ్యాలు నిజంగా మన కంట పడితే మనం వాటిని సినిమాతో పోల్చి చూస్తాం. బాహుబలిలో రమ్యకృష్ణ నీటి ప్రహహాంలో ఉండి పిల్లాడిని పైకెత్తితే మనందరం ఆహా అనుకున్నాం. ఇప్పుడు అలాంటి దృశ్యమే ఒకటి కరీంనగర్ లోని మంథని పట్టణంలో కనిపించింది. మరి.. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో పట్టణాలు, పల్లెలను వరదలు ముంచెత్తాయి. కరీంనగర్ మంథని పట్టణంలో వరద సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. అయితే అక్కడ కనిపించిన ఓ దృశ్యం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఒక వ్యక్తి మూడు నెలల పసికందును బుట్టలో పెట్టి తలపైన ఉంచుకుని.. భుజాల వరకు నీటిలో సురక్షితంగా తరలిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
అంత వరదని లెక్కచేయకుండా ముందుకు వెళ్తున్న అతని ధైర్యాన్ని చూసిన కొందరు “అక్కడ రీల్ బాహుబలి అయితే.. ఇక్కడ రియల్ బాహుబలి సీన్ రీపిట్ అయింది” అంటూ అతడిని కొనియాడుతున్నారు. మరి.. ఈ రియల్ బాహుబలి పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.