తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రతి పది సంవత్సరాలకి ట్రెండ్ ని సృష్టించే సినిమా ఒకటి వస్తుంటుంది. అలాగే ట్రెండ్ ని సృష్టించే హీరోయిన్ కూడా వస్తుంటుంది. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సరికొత్త ట్రెండ్స్ ని క్రియేట్ చెయ్యడానికి బేబీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నటి వైష్ణవి చైతన్య.
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రతి పది సంవత్సరాలకి ట్రెండ్ ని సృష్టించే సినిమా ఒకటి వస్తుంటుంది. అలాగే ట్రెండ్ ని సృష్టించే హీరోయిన్ కూడా వస్తుంటుంది. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సరికొత్త ట్రెండ్స్ ని క్రియేట్ చెయ్యడానికి బేబీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నటి వైష్ణవి చైతన్య. బేబీ సినిమాలో అద్భుతమైన నటనని ప్రదర్శించి ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయ్యింది. బేబీ సినిమాలో వైష్ణవి పోషించిన క్యారెక్టర్ కొన్ని సంవత్సరాల పాటు ప్రేక్షకుల మైండ్ నుంచి చెరిగిపోదు. ఆ లెవల్లో వైష్ణవి నటించింది. ఇంకా గట్టిగా చెప్పాలంటే కేవలం వైష్ణవి వల్లే బేబీ సినిమా ఘనవిజయం సాధించిందని చెప్పవచ్చు. జోరు వర్షాల్లో సైతం ఆడియెన్స్ బేబీ సినిమా కోసం క్యూ కట్టారు. తాజాగా వైష్ణవి సోషల్ మీడియాలో చాలా భావో ద్వేగంతో చేసిన ఒక పోస్ట్ వైరల్ అయ్యింది.
వైష్ణవి ఇప్పుడు ఫుల్ బిజీ లో ఉంది. బేబీ లో వైష్ణవి యాక్టింగ్ చూసిన అల్లు అరవింద్ తన సినిమాకి వైష్ణవిని లాక్ చేసాడు. అలాగే ఇంకొంత మంది ప్రొడ్యూసర్స్ కూడా తమ సినిమాల్లో వైష్ణవిని తీసుకుంటున్నారు. ఆ విషయాలన్నీఅలా ఉంచితే సోషల్ మీడియా ద్వారా ఇన్ఫినిటీ అనే సంస్థ గురించి తన మనుసులో ఉన్న భావాన్ని వైష్ణవి వెల్లడించింది. నా యాక్టింగ్ జర్నీ ఇన్ఫినిటీ సంస్థలోనే ప్రారంభం అయ్యిందని అలాగే తనని నటనలో ఎంతగానో ప్రోత్సహించారని తన లైఫ్ లాంగ్ ఇన్ఫినిటీ సంస్థని మర్చిపోనని చెప్పింది. ఆ సంస్థ హెడ్స్ సత్యదేవ్, వందనలు ఎంతో సపోర్ట్ చేశారని.. మంచి చెడుల్లో అండగా ఉన్నారని తెలిపింది. అలాగే ఇంకో కొత్త సంస్థని ప్రారంభిస్తున్న ఇన్ఫినిటీ సంస్థకి బెస్ట్ విషెస్ ని కూడా చెప్పింది. ఎంత స్థాయికి వెళ్లిన తన మూలాల్నివైష్ణవి మర్చిపోలేదని నెటిజన్లు అంటున్నారు.