వాతావరణంలో ఏర్పడుతున్న మార్పులు మానవ జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రధానంగా ఉరుములు, మెరుపులతో పాటు వచ్చిపడుతున్న పిడుగులు ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. మనుషులతో పాటు మూగజీవాలను కూడా బలి తీసుకుంటున్నాయి.
పిడుగులు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాలలో కురుస్తున్న ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా పడు తున్నాయి. ఈ క్రమంలో పిడుగుబాటుకు గురై పలువురు మృత్యువాత పడుతున్నారు. పలుచోట్ల మూగజీవాలు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయి. మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు వికారాబాద్ జిల్లాలో అలాంటి విషాద ఘటన చోటుచేసుకుంది. పిడుగు పడడంతో రెండు ఎద్దులు మృతి చెందాయి. మరో ఘటనలో పిడుగు మీద పడి ఓ వ్యక్తి నిల్చున్నచోటే కూలబడిపోయాడు. ఆ వివరాలు..
మంగళవారం రాత్రి సమయంలో తెలుగు రాష్ట్రాలలో భారీ వర్ష కురిసిన సంగతి తెలిసిందే. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురువుగా పలుచోట్ల వడగండ్లతో కూడిన వర్ష పడింది. అదే సమయంలో వికారాబాద్ జిల్లా యాలాల మండలం అక్కంపల్లి గ్రామానికి చెందిన అశోక్ అనే రైతు పొలం వద్దనున్న పాకలో పిడుగు పడడంతో రెండు ఎద్దులు మృతి చెందాయి. ఆయన జీవనాధారమే వ్యవసాయం. వీటిపై ఆధారపడే వారి కుటుంబం జీవనం కొనసాగిస్తోంది. ప్రకృతి కోపానికి ఎద్దులు చనిపోవడంతో ఆ కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
మరో ఘటనలో ఖమ్మం దోమ మండల పరిధిలోని నాచారం గ్రామంలో పిడుగుపాటుకు ఆవు, దూడ మృతి చెందాయి. గ్రామానికి చెందిన మేడిపల్లి వెంకటయ్య అనే రైతు పాలు ఇచ్చే ఆవు, దూడను పొలం వద్దనున్న చెట్టుకు కట్టేయడంతో అనుకోకుండా పడిన భారీ వర్షంతో పిడుగు పడి ఆవు, దూడ అక్కడికక్కడే మృతి చెందాయి. ఇంకో ఘటనలో మహారాష్ట్ర, చంద్రాపూర్ జిల్లాలో పిడుగు పడి వ్యక్తి మృతి చెందాడు. మైదాన ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తిపై పిడుగు పడింది. దీంతో అతడు నిలుచున్నచోటే పడిపోయాడు. సెకన్ల వ్యవధిలోనే అతని ప్రాణం పోయింది. అందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇలా పిడుగుబాటుకు గురై ప్రాణాలు కోల్పోయేవారు కొందరైతే.. దాని తీవ్రతకు బలవుతున్న వారు మరికొందరు.
Lightning⚡ Strike on Coalmine Worker 👷 in Maharashtra (India🇮🇳) 👇 pic.twitter.com/pifaJwnGQt
— Dr HARDIP SINGH (@DrHARDIPSINGH) April 26, 2023