వివాహ బంధం అంటే నూరేళ్లు ఒకరిపై ఒకరు నమ్మకంతో కష్టసుఖాల్లో పాలు పంచుకొని జీవితాంతం బతకడం. పెద్దల సమక్షంలో ఇష్టపూర్వకంగా పెళ్లిళ్లు చేసుకున్న జంటలు ఈ మద్య చిన్న చిన్న కారణాలతో విడిపోవడం చూస్తున్నాం. కొంతమంది అదనపు కట్నం కోసం కొడలిపై వేధింపులు.. భార్యను చిత్ర హింసలకు గురి చేయడం లాంటివి చేస్తున్నారు. మరికొంత మంది వివాహేతర సంబంధాలు పెట్టుకొని కట్టుకున్న భార్యను నడిరోడ్డు పాలు చేస్తున్నారు. కట్టుకున్న భార్యను వదిలి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భర్తను భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని చితక భాదింది.. ఈ ఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పెద్దపరిమికి చెందిన ప్రకాష్కు 2019లో అదే జిల్లాకు చెందిన త్రివేణితో వివాహం జరిగింది. ప్రకాష్ బంజారాహిల్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో చార్టర్డ్ అకౌంటెంటుగా పని చేస్తున్నాడు. ఇక వివాహ సమయంలో వరకట్నంగా రూ.20 లక్షల నగదు, 30 సవర్ల బంగారు ఆభరణాలు, 3 ఎకరాల భూమి ఇచ్చారు. పెళ్లయిన కొద్ది కాలం ఆలుమగలు బాగానే కాపురం కొనసాగించారు. హైదరాబాద్ లో కాపురం పెట్టిన ప్రకాశ్ బుద్ది వంకరగా మారింది. భార్యను దూరం పెట్టడం మొదలు పెట్టాడు.
రాత్రిళ్లు లేటుగా రావడం.. ఒక్కోసారి ఇంటికి రాకుండా ఉండటం లాంటివి చేస్తూ వచ్చాడు. అంతే కాదు సిగ్గు విడిచి అంతరంగికంగా ఉన్న ఫొటోలను తన స్నేహితులకు చూపించేవాడని.. భర్త పెట్టే బాధలను భరించలేక ఆత్మహత్యాయత్నం చేసినా పట్టించుకోలేదని బాధితురాలు వాపోయింది. ఈ క్రమంలోనే ప్రకాశ్ వేరే మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న విషయం తెలుసుకొని త్రివేణి బుధవారం రాత్రి త్రివేణి తన కుటుంబ సభ్యులతో కేపీహెచ్బీ తులసీనగర్లో రెడ్ హ్యాండ్ గా పట్టుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రకాష్ను, మహిళను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషనుకు తరలించారు.