భాగ్యనగరంలోని పలు చోట్ల ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. నగరంలోని ప్రముఖ షాపింగ్ మాల్స్కు సంబంధించిన ఆఫీసులతో పాటు.. వారి ఇళ్లల్లో కూడా సోదాలు చేశారు. నగరంలోని కూకట్ పల్లి, జూబ్లీహిల్స్, దిల్సుఖ్నగర్ సహా 10 ప్రాంతాల్లో.. ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో వస్త్ర ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి పొందిన ఆర్.ఎస్. బ్రదర్స్ వస్త్ర దుకాణాలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఐటీ దాడులు కొత్త కాకపోయినా ఇలా వస్త్ర దుకాణాలు, షాపింగ్ మాల్స్లో సోదాలు నిర్వహించడం మాత్రం ఇదే ప్రథమం.
ఇక ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఆర్ఎస్ బ్రదర్స్ భారీగా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. హానర్స్ రియల్ ఇన్ఫ్రా పేరుతో ఆర్ఎస్ బ్రదర్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఐటీ దాడులు జరిగాయి. ఇక హానర్స్ సంస్థ ఇప్పటికే పాటు ప్రాజెక్ట్లను చేపట్టింది. అలానే కూకట్పల్లిలోని గల్ఫ్ ఆయిల్ భూముల వివాదల్లో కూడా హానర్స్ హస్తం ఉంది. ఈ క్రమంలో ఐటీ అధికారులు.. హానర్స్, సుమధుర, వాసవి కంపెనీలతో పాటు.. ఆర్ఎస్ బ్రదర్స్ దుకాణాలపై కూడా దాడులు చేశారు. సుమధుర, వాసవి కంపెనీలతో కలిసి ఆర్ఎస్ బ్రదర్స్ వ్యాపారాలు చేస్తోంది. ఈ క్రమంలో వాటి మీద కూడా ఐటీ అధికారులు దాడులు చేశారు.