కొంతమంది డబ్బు కోసం ఎలాంటి నీచమైన పనులకైనా సిద్దపడుతున్నారు. ఎదుటి వారు ఏమైనా పరవాలేదు.. తాము బాగుండాలన్న ఉద్దేశ్యంతో మోసాలకు పాల్పపడుతున్నారు. అమాయకులకు మాయమాటలు చెప్పి వారి వద్ద నుంచి అందినంత దోచుకుంటున్నారు.
ఈ మద్య కొంతమంది కేటుగాళ్ళు డబ్బు కోసం ఎంతటి దారుణాలకైనా తెగబడుతున్నారు. ఎదుటి వారికి మాయమాటలు చెబుతూ దారుణంగా మోసం చేస్తున్నారు. కొంతమంది సైబర్ నేరాలతో కూర్చున్న చోటు నుంచే కోట్లు సంపాదిస్తున్నారు. మరికొంతరు అక్రమ దందాలు చేస్తూ అక్రమార్జనకు పాల్పపడుతున్నారు. తాజాగా ఓ మనిషి బతికి ఉండగానే చనిపోయినట్లు ఫేక్ డాక్యూమెంట్స్ సృష్టించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్న ఘటన కుమురం భీం జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కుమురం భీం జిల్లా బెజ్జూరు మండలం అంబేడ్కర్ కాలనీలో నివాసం ఉంటున్న కోట రాజన్న భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. కొంత కాలంగా రాజన్న తనకు వచ్చిన సంపాదనలో కొంత దాచుకుంటూ తన పేరు మీద లేబర్ ఇన్సూరెన్స్ చేయిస్తూ వస్తున్నాడు. భవిష్యత్ లో తన కుటుంబానికి పనికి వస్తుందని క్రమం తప్పకుండా ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయిస్తూ వస్తున్నాడు. రాజన్నకు భార్య, ఇద్దరు పిల్లు ఉన్నారు. ఎప్పటిలాగే కోట రాజన్న ఇన్సూరెన్స్ రెన్యూవల్ కోసం మీసేవా కేంద్రానికి వెళ్లాడు. అక్కడ తన పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ అప్పటికే క్లయిమ్ అయిన విషయం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ తిన్నాడు. తన ప్రమేకం లేకుండా తన ఇన్సూరెన్స్ డబ్బు ఎలా క్లయిమ్ చేసుకుంటాడని ఆరా తీయగా విస్తుతపోయే విషయం తెలుసుకున్నాడు.
తన పేరు పై ఉన్న ఇన్సూరెన్స్ క్లయిమ్ చేసుకున్న వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు లేబర్ డిపార్ట్ మెంట్ ఆఫీస్ కి వెళ్లి ఆరా తీశాడు. సదరు వ్యక్తి రాజన్న చనిపోయినట్లుగా ఫేక్ డాక్యూమెంట్స్ సమర్పించి ఇన్సూరెన్స్ క్లయిమ్ సుకున్నట్లు తెలుసుకున్నాడు. తన పేరు తో ఇన్సూరెన్స్ ను ఎవరో క్లయిమ్ చేసుకున్నారని అధికారులకు ఫిర్యాదు చేశాడు. తాను బతికి ఉండగానే ఫేక్ డాక్యూమెంట్స్ సమర్పించి ఎలా క్లయిమ్ చేసుకుంటారు.. సిబ్బంది ఎంతకు ఎంక్వెయిరీ చేయలేదు అని అధికారులను ప్రశ్నించాడు రాజన్న. తన పేరు మీద ఎవరు క్లయిమ్ చేశారో విషయంపై వెంటనే విచారణ చేపట్టి తనకు న్యాయం చేయాలని కోరాడు రాజన్న.