యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తుండగా AIMIM చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కారుపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఆయన వాహనంపై గుర్తు తెలియని దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఒవైసీ మీరట్లోని కితౌర్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఛిజారసీ టోల్ గేట్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టోల్ గేట్ వద్దకి రాగానే మొత్తం నలుగురు వచ్చి కారుపై కాల్పులు జరిపారని ఆయన వెల్లడించారు. తనపై పిరికిపందలు జరిపిన దాడి అని అన్నారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.
ఇది చదవండి : విషాదం.. భవనం కూలి ఆరుగురు దుర్మరణం!
ఇదిలా ఉంటే.. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పై దాడి ఘటనతో పాతబస్తీలో హై అలెర్ట్ కొనసాగుతోంది. శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అలెర్ట్ అయ్యారు. సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెంచారు. ఇదిలా ఉంటే.. తనను లక్ష్యంగా చేసుకొని సాగించిన కాల్పుల ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ఎన్నికల సంఘానికి ఒవైసీ విజ్ఞప్తి చేశారు. మరోవైపు అసదుద్దీన్ ఒవైసీపై కాల్పులు జరిపిన వ్యక్తిని అరెస్టు చేశామని, అతడి వద్ద నుంచి పిస్తోల్ స్వాధీనం చేసుకున్నామని ఉత్తరప్రదేశ్ అదనపు డీజీపీ ప్రశాంత్ కుమార్ చెప్పారు.