GHMC Officials Seized Pub In Hyderabad: హైదరాబాద్లోని ఓ పబ్పై జీహెచ్ఎంసీ అధికారులు ఉక్కు పాదం మోపారు. నిబంధనలు పాటించటం లేదన్న కారణంతో జూబ్లిహిల్స్లోని మకావ్ పబ్పై చర్యలు తీసుకున్నారు. జీహెచ్ఎంసీ ప్రాపర్టీ టాక్స్ చెల్లించకపోవటంతో పాటు ఫైర్ సేఫ్టీ పాటించకపోవటంతో పబ్ను సీజ్ చేశారు. ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎన్ఓసీని రెన్యువల్ చేసుకోవాలని పంపిన నోటీసులను పబ్ పట్టించుకోలేదు.
దీంతో జీహెచ్ఎంసీకి సంబంధించిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పబ్ చుట్టూ సెట్ బాక్స్ లేకపోవటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించని పబ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : అవుటర్ రింగ్రోడ్డుపై థమ్స్అప్ లోడ్ లారీ బోల్తా.. ఎగబడ్డ జనం.. క్షణాల్లో లూటీ!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.