టీఎస్ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా మార్పులు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు ప్రయాణికులకు ఉపయోగపడే విధంగా పలు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మొత్తానికి ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీఎస్ ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో రక రకాల మీమ్స్ తో ప్రయాణీకులను ఆకర్షిస్తున్నారు సజ్జనార్. ఒక్కోసారి స్వయంగా సజ్జనార్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తూ ప్రయాణీకుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.
ప్రయాణికుల సంఖ్య పెంచేందుకు ఆర్టీసీలో ప్రయాణిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. అంతే కాదు ఒక్కో ఈవెంట్ కి సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ప్రతి సంవత్సరం మహిళలకు సంబంధించిన పండుగలు, ఈవెంట్స్ కి ఆయన బంపర్ సజ్జనార్ ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మదర్స్ డే సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో చంటి పిల్లలతో ప్రయాణించే మహిళల నుంచి టికెట్ వసూలు చేయబోమని ప్రకటించింది. ఐదు సంవత్సరాల లోపు వయస్సు ఉన్న చిన్న పిల్లల తల్లులు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని తల్లులను అభినందించే ఉద్దేశంతోనే ఈ కానుకను అందిస్తున్నట్టు చెప్పారు. అయితే ఈ ఆఫర్ ఆదివారం ఒక్క రోజు మాత్రమేనని, చంటిపిల్లల తల్లులు ఈ ఆఫర్ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. ఫ్రీ ఆఫర్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#TSRTC is delighted to present a special offer to celebrate the day & give them a unique experience of FREE TRAVEL in all the bus services, including AC services. #mothers travelling with children below five years can avail the offer on 8th May, 2022 #MothersDay2022 pic.twitter.com/X1EpYeMt07
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) May 6, 2022