ఈ మద్య అడవుల్లో ఉండాల్సిన కృర మృగాలు పట్టణాలు, గ్రామాల్లో సంచరిస్తున్నాయి. పశువులు, కోళ్లును చంపేస్తున్నాయి. వీటి దాడుల్లో కొన్నిసార్లు మనుషులు గాయపడటమే కాదు.. చనిపోతున్నారు. ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం కలకలం సృష్టింది.
మనిషి చేస్తున్న తప్పుడు అతనికే శాపాలుగా మారుతున్నాయి. విలాసవంతమైన మనుగడ కోసం అడవులను నరికేస్తున్నారు.. కాలుష్యాన్ని పెంచుకుంటూ పోతున్నాడు.. దీంతో పర్యావరణం తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఇటీవల అడవుల్లో జీవించాల్సిన కృరమృగాలు పట్టణాలు, గ్రామాలపై పడుతున్నాయి. పశువులు, కోళ్లను తీనడమే కాదు.. కొన్నిసార్లు మనుషులపై దాడులు చేస్తూ చంపేస్తున్నాయి. తెలంగాణ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొంత కాలంగా పులు సంచారం విపరీతంగా పెరిగిపోయింది. నిత్యం ఎక్కడో అక్కడ పులులు కనిపిస్తున్నాయని ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
గత కొంతకాలంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం పెరిగిపోయిందని.. ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని జీవించాల్సి వస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం అర్థరాత్రి జిల్లాలోని భీంపూర్ మండలంలో పిప్పల్ కోటి రిజర్వాయర్ వద్ద నాలుగు పులులు ఒకేసారి కనిపించాయి. అటుగా వెళ్తున్న వాహనదారుడు ఇది గమనించి తన సెల్ ఫోన్ లో పులులు సంచరిస్తున్న దృశ్యాలను చిత్రీకరించాడు. వెంటనే బ్యారేజ్ పనులు నిర్వహిస్తున్న అధికారికి ఈ సమాచారం అందించడంతో ఆయన అటవీశాఖ అధికారులకు పులుల సంచారం గురించి వివరించాడు.
రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు పులులు రోడ్డు దాటుతున్న దృశ్యాలను గమనించి వాటి అడుగులు పరిశీలించి.. నాలుగు పులులు సంచరించిన విషయాన్ని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో గొల్లఘాట్ గ్రామ పరిసర ప్రాంత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో రాత్రిపూట బయటకు రావొద్దని సూచించారు. పులులను పట్టుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. అప్పటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. 2 నెలల క్రితం ఇదే ప్రాంతంలో 4 పులులు సంచరించిన వార్తలు వచ్చాయి. తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి పెన్ గంగ దాటుతూ ఈ ప్రాంతానికి పులులు వస్తున్నాయని అధికారులు అంటున్నారు.
ఇటీవల ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో వరుసగా పులుల సంచారానికి సంబంధించిన దృశ్యాలు టీవీల్లో రావడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పలు గ్రామాల్లో పులులు మూగ జీవాలపై దాడులు చేస్తూ చంపేస్తున్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు మనుషులను కూడా బలి తీసుకుంటున్నాయి. త్వరగా పులులను పట్టుకోవాలని ప్రజలు అటవీ అధికారులను కోరుతున్నారు. అటవీ శాఖ అధికారులు పులుల కోసం బేస్ క్యాంపులు ఏర్పాటు చేశారు. పులులు సంచరించే ప్రాంతంలో అర్ధరాత్రి బయటకు రావొద్దని గ్రామస్థులను అధికారులు హెచ్చరిస్తున్నారు.