పెళ్లి కుదిరింది అనగానే.. అందరు మొదట వేసే ప్రశ్న..కట్నం ఏమి ఇస్తున్నావు? ఎవరి స్థోమతను బట్టి వారు డబ్బులు, వాహనాలు, ఇతర ఆస్తులు కట్నంగా ఇస్తారు. కానీ ఓ అల్లుడికి మాత్రం ఎడ్లబండిని కట్నంగా అందించారు ఓ మామ. అవును మీరు విన్నది నిజమే.. ఎడ్లబండినే కట్నంగా ఇచ్చారు.మరి ఆల్లుడి రియాక్షన్ ఏమింటి? ఆ మామ ఎందుకు ఎడ్లబండినే కట్నంగా ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం..
వివరాల్లోకి వెళ్తే..ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని దొంగచింత గ్రామానికి చెందిన పెందూరు లచ్చు, పారూబాయి దంపతులు తమ పెద్ద కుమార్తె లింగుబాయి. ఆమెను అదే గ్రామానికి చెందిన జూగాదిరావుతో ఆదివాసీ సంప్రదాయ పద్ధతిలో వివాహం జరిపించారు. ఆ గ్రామంలో ఆదివాసీలు కట్నం లేకుండా వివాహాలు చేసుకుంటారు. కొన్నేళ్లుగా ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం ఇది. అయితే, తన కూతురు అత్తింట్లో కష్టపడకుండా ఉండాలని అనుకున్నాడు లచ్చు. అల్లుడు వ్యవసాయ పని సులభంగా చేసుకునేలా ఎడ్లబండిని కట్నంగా అందించాడు.
లక్షల నగదు, వాహనాలు, కోట్లలో ఆస్తులు డిమాండ్ చేసే నేటితరం అల్లుళ్లకి పూర్తి భిన్నంగా జూగాదిరావు తన మామ ఇచ్చిన ఎడ్లబండిని ఆనందంగా స్వీకరించాడు. అనంతరం ఎడ్లబండికి పూజచేసి వధూవరులు దానిపైనే వరుడి ఇంటికి బయలుదేరారు.ఈ వివాహానికి పలువురు ప్రజాప్రతినిధులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అదనపు కట్నం కావాలని డిమాండ్ చేసే అల్లుళ్లు జూగాదిరావు చూసి మారాలి అని నెటిజన్లు అంటున్నారు. అందరూ జూగాదిరావులా ఆలోచించి, ఇచ్చింది తీసుకుంటే.. వర కట్న వేధింపులే ఉండవేమో. మరి.. ఈవిషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.