సాధారణంగా బీజీ లైఫ్ గడిపేవాళ్లు.. ఉద్యోగులు ఇంట్లో వంట చేసుకునే సమయం లేకపోవడంతో ఫుడ్ కోసం ఆన్ లైన్ ఆర్డర్లు చేస్తున్నారు. తాము ఎంతో ఇష్టపడే ఫుడ్ వచ్చింది.. తృప్తిగా తినాలీ అనుకునే లోపు వాటిలో పురుగులు, బొద్దింయలు, ఇతర చిన్న వస్తువులు కనిపించడంతో ఖంగు తింటున్నారు. ఇటాంటి ఘటనలు ప్రతిరోజూ ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి.
సాధారణంగా ఎవరికైనా బిర్యానీ పేరు వినగానే నోటిలో లాలాజలాలు ఊరుతాయి. గుమ గుమలాడే బిర్యానీ తినడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడుతుంటారు. భారత దేశంలో ఎక్కువగా ఇష్టంగా తినే ఆహారం ఏంటని సర్వే చేస్తే బిర్యానీ తొలి స్థానింలో నిలిచింది. అంతేకాదు ఆన్ లైన్ లో ఎక్కువ ఆర్డర్ చేసే ఫుడ్ కూడా బిర్యానీ కావడం విశేషం. చాలా మంది బిజీ లైఫ్ గడిపేవారు ఆన్ లైన్ లో ఆర్డర్లు చేస్తున్నారు. కొన్నిసార్లు రెస్టారెంట్స్, హూటల్ యాజమాన్యం నిర్లక్ష వల్ల ఆర్డర్ చేసిన ఫుడ్ లో బొద్దింకలు.. ఇతర పురుగులు, ఇనుప వస్తువులు ప్రత్యేక్షం కావడం చూస్తూనే ఉన్నాం. కూకట్ పల్లిలో ఓ వ్యక్తి బిర్యానీ ఆర్డర్ ఇస్తే అందులో బొద్దింక ప్రత్యేక్షం అయ్యింది.
కూకట్ పల్లి పరిధిలోని రాఘవేంద్ర ఫుడ్ కోర్టు నుంచి ఓ వ్యక్తి జొమాటో ద్వారా బిర్యానీ బుక్ చేసుకున్నాడు. ఆర్డర్ చేసిన బిర్యానీ ఇంటికి రావడంతో మనోడు తినడం ప్రారంభించాడు. అయితే బిర్యానీలో బొద్దింక ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా షాక్ తిన్నాడు. వెంటనే బిర్యానీలో బొద్దింక ఉన్న ఫోటో కొట్టి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులకు, జొమాటో యాజమాన్యానికి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పై స్పందించిన జోమాటో టీమ్ తగిన చర్యలు చేపడతామని కస్టమర్ కి హామీ ఇచ్చింది.
ఇటీవల కొన్ని హూటళ్లు, రెస్టారెంట్స్ లో ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన ఫుడ్ లో పురుగులు వస్తున్నాయి.. పాడైపోయిన ఫుడ్ డెలివరీ చేస్తున్నారని జీహెచ్ఎంసీ కి చాలా మంది ఫిర్యాదులు ఇస్తూనే ఉన్నారు. ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన ఫుడ్ క్వాలిటీగా లేకుంటే సదరు ఆన్ లైన్ ఫుడ్ యాప్ లపై నెగిటీవ్ కామెంట్స్, కంప్లయింట్లు, రివ్యూలు పెడుతున్నారు కస్టమర్లు. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టించుకోవాలని కోరుతున్నారు.