తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగింది. ఈ సందర్భంగా ఎందరో అమర వీరులు తమ రక్తాన్ని చిందిస్తే కానీ.. తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది. అలాంటి వారిలో మొదటి ఉద్యమ అమరవీరుడు
ప్రపంచంలో , ప్రాణత్యాగం లేకుండా, నెత్తురు చుక్క చిందించకుండా ఏ ఉద్యమం ముందుకు సాగలేదని చరిత్ర చెప్పిన నిజం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విషయంలో కూడా ఇదే జరిగింది. ఎంతోమంది తమ ప్రాణాలు త్యాగం చేయగా వచ్చింది ప్రత్యేక తెలంగాణ. తొలిదశ ఉద్యమంలో 369 మంది అమరవీరులు తమ ప్రాణాలు త్యాగం చేస్తే.. మలిదశ ఉద్యమంలో 1200 మంది అమరవీరులు తమ ప్రాణాలు ధారపోస్తే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది. తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసుకున్న తొలి ఉద్యమకారుడు శ్రీకాంతాచారి. కేసీఆర్ అరెస్ట్ ని నిరసిస్తూ శ్రీకాంతా చారి జై తెలంగాణ అంటూ ఏకంగా తన ఒంటిమీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. 3 డిసెంబర్ 2009 తెలంగాణలో శ్రీకాంతాచారి రగిలించిన ఉద్యమ జ్వాల నిప్పు కణికలా మారింది. మొత్తానికి శ్రీకాంతాచారి కన్న కల సాకారం అయ్యింది.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. సీఎం కేసీఆర్.. అమరవీరుల స్మృతిలో భాగంగా శ్రీకాంతా చారి చేసిన త్యాగానికి ప్రతిఫలంగా గొప్పమనసు చాటుకోబోతున్నారు.. ఆయన తల్లి శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని సీఎంకేసీఆర్ నిర్ణయించుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
శ్రీకాంతా చారి ఈ పేరు వింటే ప్రతి తెలంగాణ పౌరుడికి ఆయన చేసిన ప్రాణ త్యాగం గుర్తుకు వస్తుంది. తెలంగాణ ఉద్యమం పెద్దఎత్తు సాగుతున్న సందర్భంలో కేసీఆర్ అరెస్టు చేశారు. ఆయన అరెస్ట్ పై నిరసనగా జరిగిన ధర్నాలో పాల్గొన్న శ్రీకాంతా చారి ఒక్కసారిగా జై తెలంగాణ అంటూ తన ఒంటిమీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. రెండు రోజుల తర్వాత 2009, డిసెంబర్ 3న శ్రీకాంతాచారి అమరుడయ్యాడు. ప్రస్తుతం శ్రీకాంతాచారి మన మధ్య భౌతికంగా లేకున్నా ఆ అమరుని త్యాగాన్ని తెలంగాణ సమాజం ఎప్పటికీ మర్చిపోదు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ‘తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు’ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు రోజును.. అమర వీరులకు కేటాయించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమరవీరుడైన శ్రీకాంతా చారి త్యాగానికి గుర్తుగా గొప్ప మనసు చాటుకోబోతున్నారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకన్నట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ మలి దశ ఉద్యమంలో తన ప్రాణాల తీసుకొని అమరుడైన శ్రీకాంతా చారి త్యాగానికి ప్రతిఫలం దక్కనుంది. ఇప్పటికే శ్రీకాంతా చారి కోరుకున్నట్లు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు ఆయన త్యాగానికి ప్రతిఫలంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తుంది. ప్రసుతం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మకు బీఆర్ఎస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి జగదీష్ రెడ్డి ఆమెను హైదరాబాద్ కి తీసుకు వచ్చారు. మంత్రి కేటీఆర్ హామీ మేరకు శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు రోజును.. అమర వీరుల కోసం కేటాయించిన విషయం తెలిసిందే. రేపు 22, గురువారం ట్యాంక్బండ్పై నిర్మించిన అమరవీరుల స్మారక చిహాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. తర్వాత భారీ బహిరంగ సభ లో పాల్గొంటారు. ఈ సభలోనే అమరవీరుడు అయిన శ్రీకాంతాచారి తల్లికి పదవిని ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.