సింగరేణి కార్మికులకు, కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కనుక ప్రకటించారు. సంస్థ లాభాల్లో 30 శాతం వాటా సంస్థలో పని చేసే ఉద్యోగులకు, కార్మికులకు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. దసరా పండుగ లోపు ఈ లాభాలను వారి ఖాతాల్లో జమ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థ 2021-2022 సంవత్సరానికి గాను ఆర్జించిన లాభాల్లో 30 శాతం వాటాను.. సింగరేణి కార్మికులకు దసరా కానుకగా అందించాలని, దసరా లోపే వెంటనే చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో అర్హులైన కార్మికులందరికీ రూ. 368 కోట్లను సింగరేణి సంస్థ చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. దసరా లోపు సీఎం ఆదేశాల మేరకు.. సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా చెల్లించాలని సింగరేణి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కు సీఎం ప్రిన్సిపాల్ సెక్రటీరీ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో సింగరేణి కార్మికుల్లో ఉత్సాహం నెలకొంది.