ఈ మద్య కొంతమంది అకతాయిలు బస్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్ట్ లో బాంబు పెట్టామని బెదిరింపు కాల్స్ చేయడం పరిపాటైంది.. బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో హుటాహుటిన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ రంగంలోకి ఏమీ లెకపోవడంతో ఊపిరి పీల్చుకుంటారు.
ఇటీవల కొంతమంది అకతాయిలు బస్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్ట్ లో బాంబు పెట్టామని బెదిరింపు కాల్స్ చేయడం.. హుటాహుటిన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగి ఆయా ప్రాంతాల్లో ఎలాంటి బాంబులు వేవని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకోడం జరుగుతుంది. ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతూనే ఉంటాయి. తాజాగా శంశాబాద్ ఎయిర్ పోర్ట్ లో బాంబు పెట్టినట్టు ఓ అగంతకుడి నుంచి బెదిరింపు కాల్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. చెన్నై-హైదరాబాద్ ఇండిగో విమానంలో బాంబు పెట్టామని ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే అప్రమద్దమైన సిబ్బంది ఆ కాల్ ఎక్కడ నుంచి వచ్చిందనే విషయంపై దృష్టి పెట్టారు. ఫోన్ కాల్ చేసింది అజ్మిరా భద్రయ్య గా సీఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ గుర్తించారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే భద్రయ్య తాను ఎందుకు బెదిరింపు కాల్ చేశాడో అన్న విషయం విన్న పోలీసులు ఒక్కసారే ఖంగు తిన్నారు. ఆలస్యంగా రావడంతో విమానంలో తనను ప్రయాణించడానికి సిబ్బంది నిరాకరించినందుకు అవమానంగా భావించి బాంబ్ కాల్ చేసినట్లు తెలిపాడు. నిందితుడు అజ్మిరా భద్రయ్యను RGIA పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.