హైదరాబాద్ బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ హోటల్లోని పుడింగ్ మింక్ పబ్లో డ్రగ్స్ వెలుగు చూసిన సంఘటన ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది. ఈ సంఘటనకు సంబంధించి మెగా డాటర్ నిహారిక, బిగ్బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్తో పాటు పలువురు ప్రముఖుల పిల్లలను అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ని స్వాధీనం చేసుకోవడమే కాక పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: డ్రగ్స్ కేసులో కావాలనే నా పేరును ప్రసారం చేస్తున్నారు: నటి హేమ
ఈ క్రమంలో పబ్లో నిర్వహించిన రేవ్ పార్టీకి మొత్తం 142 మంది హాజరు అయ్యారని.. వీరిలో ఐదుగురు విదేశీయులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇక పార్టీకి హాజరైన వారి వివరాలు పోలీసులు వెల్లడించారు. ఇక పబ్లో పార్టీ వెనక మేనేజర్ కునల్ పాత్ర ఉందని పోలీసులు భావిస్తున్నారు. డ్రగ్ పెడరల్తో కునల్కు లింకులున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కునల్ డ్రగ్స్తో పార్టీకి వచ్చిన వారితో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. అంతేకాక కునల్ డ్రగ్స్తో వచ్చిన వారికి దగ్గరుండి సెక్యూరిటీ క్లియర్ చేయించాడు. డ్రగ్స్ కోసం కోడ్ లాంగ్వేజ్ వాడారు. బ్రో, స్టఫ్, సోడా, కూల్ లాంటి కోడ్ భాషలో డ్రగ్స్ సప్లై చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు వస్తున్నారనే సమాచారం తెలిసిన వెంటనే కునల్ డ్రగ్స్తో వచ్చిన వారిని అప్రమత్తం చేశాడు.
ఇది కూడా చదవండి: డ్రగ్స్ కేసులో నిహారికకు నోటీసులు.. క్లారిటీ ఇచ్చిన నాగబాబు!పబ్బులో డ్రగ్స్ వ్యవహారంలో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పబ్బు నిర్వాహకుడు అభిషేక్ ఉప్పల్ సహా అనిల్ కుమార్, కునల్ ఉన్నారు. 3 నెలల కిందటే అభిషేక్ ఉప్పల్ పబ్ను లీజుకు తీసుకున్నాడు. టాస్క్ఫోర్స్ దాడి చేయగానే పార్టీకి హాజరైన వారు ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ పడేసి పరారయ్యే ప్రయత్నం చేశారు. పోలీసులు దాడి చేసినప్పుము పార్టీలో 96 మంది యువకులు, 36 మంది యువతులు ఉన్నారు. డ్రగ్స్పై ప్రశ్నించేందుకు అభిషేక్, అనిల్ కుమార్ను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.