సంచలనంగాా మారిన నవీన్ హత్య కేసు రోజుకొక మలుపుకు తిరుగుతోంది. అయితే ఈ ఘటనలో నిహారిక, హరి కాకుండా అసలు దోషులు తప్పించుకున్నారా? అసలేం జరిగిందంటే?
తెలంగాణలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలో ప్రజల నోళ్లల్లో నానుతున్న అంశం నవీన్ హత్య కేసు. రాక్షసుడిగా మారిన హరిహరకృష్ఱ తాను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకునేందుకు స్నేహితుడు నవీన్ ను అతి కిరాతకంగా హత్య చేశాడు. అంతేకాకుండా అతని శరీర భాగాలను ఒక్కొక్కటిగా వేరు చేసి తన ప్రియురాలికి వాట్సాప్ లో షేర్ చేసి రాక్షసానందాన్ని పొందాడు. అయితే ఇంతటి దారుణానికి పాల్పడిన ఈ ఘటనలో నిందితులైన హరిహరకృష్ణతో పాటు తాజాగా అతని ప్రియురాలైన నిహారిక, ఫ్రెండ్ హసన్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అసలు ఈ ఘటనలో నిహారిక, హరి కృష్ణ కాకుండా అసలు దోషులు వేరే ఉన్నారా? సమాజంలోని పరిస్థితుల ప్రభావమే ఇలాంటి హత్యలకు కారణమవుతున్నాయా?
ఓ యువకుడు తప్పు దారిలో నడుస్తున్నాడంటే దీనికి అసలు కారణం అతడి తల్లిదండ్రులే అంటూ సమాజం అంతా వారి వైపు వేలెత్తి చూపిస్తుంది. ఆ యువకుడు తప్పుడు మార్గం వైపు వెళ్లడానికి కేవలం అతడి తల్లిదండ్రులే అంటూ వారిని నిందిస్తుంటారు. ఇక తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడడం, ప్రేమించిన వారిని దక్కించుకునేందుకు చివరికి ఎంతటి వారినైన హత్య చేసేందుకు కత్తులు నూరుతున్నారు. దీనికి ఎన్నో ఘటనలు సాక్షంగా చెప్పవచ్చు. ఇలా సమాజంలో జరుగుతున్న అనేక దారుణాలను చేయమని ఏ తల్లిదండ్రులు చెప్పరు, ప్రోత్సహించరు కూడా.
అందుకు కారణం.. సమాజంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు, సోషల్ మీడియా ప్రభావమే ఇలాంటి హత్యలకు కారణాలుగా చెప్పొచ్చని కొందరు మేధావులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇందుకు ఒక నవీన్ హత్య కేసు మాత్రమే కాకుండా ఈ మధ్యకాలంలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన శ్రద్దా వాకర్ హత్య కేసు కూడా సమాజంలో ఉన్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఎంత పెద్ద తప్పు చేసినా సరే కొన్ని రోజులు జైలులో ఉండి ఆ తర్వాత బెయిల్ పై బయటకు రావొచ్చనే భ్రమలో ఉంటూ కొందరు దారుణాలకు తెగబడుతున్నారు. ఇంతటి దారుణాలకు పాల్పడుతున్న వారిని చట్టాలు చుట్టాల్లా వచ్చి పలకరించి వెళ్లిపోతున్నాయి తప్పా.. ఎవరికీ కూడా సరైన న్యాయం జరగడం లేదని కొందరు బాధితులు వాపోతున్నారు.
ఇలా ఊహించిన రీతిలో దారుణాలకు పాల్పడుతున్న వారికి సరైన కౌన్స్ లింగ్ ఇచ్చి భవిష్యత్ లో ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా సరైన గైడెన్స్ దిశగా ప్రభుత్వ ఆలోంచాలని కొందరు తలలు పండిన మేధావులు అభిప్రాయపడుతున్నారు. అయితే నవీన్ హత్యకు అసలు దోషులు నిహారిక, హరినే కాకుండా ప్రస్తుత సమాజంలోని వ్యక్తులు, సోషల్ మీడియా ప్రభావం పరోక్షంగా కారకులని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక నేటి కాలంలో జరుగుతున్న ఇలాంటి దారుణాలకు సమాజంలోని ప్రస్తుత పరిస్థితులు, సోషల్ మీడియానే కారణాలు అని మీరు భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.