డబుల్ బెడ్ రూం వస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూసిన ఓ మహిళకు నిరాశే ఎదురైంది. దీంతో మనస్థాపానికి గురైన ఆ మహిళ అధికారుల ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకం డబుల్ బెడ్ రూం ఇళ్లు. దీని ద్వారా రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయించింది. అయితే ఈ పథకం ద్వారా నగరంలో చాలా మందే లబ్దిపొందారనే చెప్పాలి. కానీ, గ్రామాల్లోని ప్రజలకు మాత్రం ఈ పథకం చాలా వరకు అందలేదు. అలాగే డబుల్ బెడ్ రూం ఇల్లు వస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూసిన ఓ నిరుపేద మహిళకు నిరాశే ఎదురైంది. దీంతో ఆ మహిళ మనస్థాపంతో తాజాగా ఒంటిపై పెట్రోల్ పోసుకుంది. ఇదే అంశం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.
స్థానికుల సమాచారం ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతంలోని ప్రజలు చాలా మంది గతంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందరితో పాటు ఇదే ప్రాంతానికి చెందని ఓ మహిళ సైతం దరఖాస్తు చేసుకుంది. అయితే ఈ డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎవరికి ఇవ్వాలో తేల్చుకోలేని అధికారులు డ్రా పద్దతి ద్వారా ఎంపిక చేసే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే కొందరు డబుల్ బెడ్ రూంలో ఇళ్లు పొందారు. కానీ, ఎంతో ఆశతో ఎదురు చూసిన ఆ మహిళకు డ్రాలో ఆమె పేరు మీద డబుల్ బెడ్ రూం ఇళ్లు రాలేదు. దీంతో ఆ మహిళ తీవ్ర మనస్థాపానికి గురైంది.
ఆ సమయంలో ఆమెకు ఏం చేయాలో తెలియక అధికారుల ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆ మహిళను రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా కాస్త వైరల్ గా మారుతోంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. డబుల్ బెడ్ రూంలో రాలేదని ఒంటిపై పెట్రోల్ పోసుకున్న ఈ మహిళ తీరుపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) March 4, 2023