వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్ 19 వరల్డ్ కప్లో టీమిండియా ఫైనల్కు చేరింది. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్లో ఘన విజయం సాధించింది యష్ ధుల్ సేన. శనివారం ఇంగ్లండ్తో ఫైనల్లో తలపడనుంది. కాగా ఆసీస్తో జరిగిన సెమీస్లో టీమిండియా కెప్టెన్ యష్ ధుల్ సెంచరీతో చెలరేగి భారత్ భారీ స్కోర్ చేసేందుకు తోడ్పడ్డాడు. అతనికి గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ కూడా తోడైయ్యాడు. ఇద్దరు కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పి.. ఆసీస్ ముందు 291 పరుగుల భారీ లక్ష్యం ఉంచారు.
కాగా ఈ మ్యాచ్లో యష్ ధుల్ సెంచరీతో టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ సరసన చేరాడు. అండర్ 19 వరల్డ్ కప్లో టీమిండియా కెప్టెన్గా విరాట్ కూడా సెంచరీ చేశాడు. అలాగే మరో ఆటగాడు ఉన్ముక్త్ చంద్ కూడా 2012లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో సెంచరీతో కదం తొక్కాడు. దీంతో వరల్డ్ కప్లో సెంచరీ చేసిన కెప్టెన్ల జాబితాలో యష్ ధుల్ కూడా చేరిపోయాడు. మరి యష్ బ్యాటింగ్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.