వెస్టిండీస్ వేదికగా జరిగిన అండర్ 19 ప్రపంచ కప్ టోర్నీలో యశ్ ధుల్ నేతృత్వంలోని యంగ్ ఇండియా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. భారత జట్టు విజయంలో గుంటూరుకు చెందిన షేక్ రషీద్(వైస్ కెప్టెన్) కీలక పాత్ర పోషించాడు. కీలక మ్యాచ్ల్లో సత్తా చాటి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. తాజాగా ఈ యువ అతగాడికికు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూ.2 లక్షలు ఆర్థిక సాయం చేశారు. పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సెలెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ నుంచి సాయం అందించారు. జనసేన నాయకులు.. గుంటూరులోని రషీద్ నివాసానికి వెళ్లి పవన్ కల్యాణ్ తరఫున చెక్కును అందించారు.
అండర్ 19 ప్రపంచకప్లో రషీద్ భారత జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ టోర్నీలో రషీద్ నాలుగు మ్యాచ్లు ఆడి 50.25 సగటుతో 201 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. కరోనా బారిన పడటంతో అతను రెండు మ్యాచ్లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఓపెనర్లు విఫలమైన భారత్ చాంపియన్గా నిలిచిందంటే.. మూడో స్థానంలో రషీద్.. 4వ స్థానంలో యశ్ ధుల్ (4 మ్యాచ్ల్లో 76.33 సగటుతో 229) గొప్పగా రాణించడం వల్లే. సెమీస్లో మూడో వికెట్కు 204 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఆ మ్యాచ్లో యశ్ శతకం చేయగా.. రషీద్ 94 పరుగులు చేసాడు. ఇక ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో షేక్ రషీద్ను తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తికనబర్చలేదు. 17 ఏళ్ల వయసు కావడంతోనే అతన్ని పక్కనపెట్టేసాయి.
Great gesture by #PowerStar @PawanKalyan by rewarding 2 lakh/- to SK Rasheed (Vice Captain of Indian Team Under-19) on winning U-19 Cricket World Cup 2022#BheemlaNayak https://t.co/oo0X6wPmXQ
— PawanKalyanFans (@PAWANISTS) March 8, 2022
India Win U19 Asia Cup 2021: Sourav Ganguly, VVS Laxman and Others Congratulate Boys in Blue After Their Record Title Triumph With Win Over Sri Lanka U19 in Final pic.twitter.com/JGK0ccbmzL
— Shaik Rasheed (@skrasheed66) March 9, 2022