ఇండియా – పాకిస్థాన్ మధ్య రైవలిటీ ఈ నాటిది కాదు. క్రికెట్లో కూడా ఈ పోటీ చాలా కాలంగా కొనసాగుతూనే వస్తోంది. అయితే.. పాక్ ఆటగాళ్ల విజయాలను ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదు. ఇప్పుడు పాక్ టీమ్లో కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్న బాబర్ అజాం, రిజ్వాన్, షాహీన్ అఫ్రీది వంటి ఆటగాళ్లు అందరినీ మన మాజీ ప్లేయర్స్ పలు సందర్భాల్లో మెచ్చుకున్నారు కూడా. అయితే.. ఇవన్నీ గుర్తు పెట్టుకోని పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్.. టీమిండియా నయా స్టార్ సూర్యకుమార్ యాదవ్పై తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇంతకీ.. సూర్యకుమార్ యాదవ్పై పాకిస్థాన్ మద్దతుదారులకు ఎందుకు అంత కోపం అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ టీ20 ర్యాంకింగ్స్లో దుమ్ములేపాడు. ఏకంగా నంబర్ 2 స్థానానికి చేరుకున్నాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ తర్వాతి స్థానంలో నిలిచాడు. మంగళవారం వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో 44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులతో 74 పరుగలతో అదరగొట్టిన సూర్యకుమార్ యాదవ్.. 816 పాయింట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో పాక్ క్రికెటర్ మొహమ్మద్ రిజ్వాన్ను వెనక్కు నెట్టి రెండోస్థానాన్ని అందుకున్నాడు.
బాబర్ అజమ్ 818 పాయింట్లతో మొదటిస్థానంలో కొనసాగుతున్నాడు. మూడో స్థానంలో రిజ్వాన్ 794 పాయింట్లతో ఉన్నాడు. ఇక బాబర్కు, సూర్యకుమార్ యాదవ్కు కేవలం రెండు పాయింట్లే తేడా ఉంది. వెస్టిండీస్తో మిగిలిన రెండు మ్యాచుల్లో మంచి ప్రదర్శన కనబరిస్తే.. వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్గా సూర్యకుమార్ యాదవ్ నిలిచే అవకాశం ఉంది. ఇప్పుడే ఇదే పాక్ క్రికెట్ ఫ్యాన్స్ అక్కసుకి కారణం అవుతోంది.
“వెస్టిండీస్ టూర్ లో మొదటి రెండు టీ20 మ్యాచుల్లో సూర్య విఫలమయ్యాడు. మూడో టీ20లో మాత్రమే హాఫ్ సెంచరీ సాధించాడు. ఒక్క హాఫ్ సెంచరీ సాధిస్తేనే.. 83 పాయింట్స్ యాడ్ అవుతాయా? ఒక్క ఇన్నింగ్స్ తో.. సూర్యకి ఎన్ని పాయింట్స్ ఎలా వచ్చాయి? ఆ లెక్కన మా బాబర్ అజాం, రిజ్వాన్ ఖాతాలో ఎన్ని పాయింట్స్ ఉండాలి? ఈ ర్యాంకింగ్ విధానంలో ఏదో మతలబు ఉంది అంటూ”.. పాక్ క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అయితే.. ఇక్కడ వారికి తెలియనది ఏమిటంటే.. ర్యాంకింగ్ పాయింట్స్ అనేవి.. ఒక్క ఇన్నింగ్స్ తో లెక్క కట్టేవి కాదు. ఆయా సిరీస్ లో మొత్తం మ్యాచ్లు.. అందులోని యావరేజ్, నాటౌట్ల సంఖ్య, ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఆయా ఆటగాళ్లకు పాయింట్స్ అలాట్ చేస్తారు. పాపం ఇవన్నీ తెలియని పాక్ క్రికెట్ ఫ్యాన్స్ సూర్యపై సోషల్ మీడియా వేదికగా అక్కసు వెళ్లగక్కుతున్నారు. నిజానికి బాబర్ అజాం, రిజ్వాన్ పాకిస్థాన్ బెస్ట్ ప్లేయర్స్. ఇప్పుడు సూర్య కుమార్ యాదవ్ మెరుపు వేగంతో వచ్చి వారి ర్యాంకులకు ఎసరు పెట్టడంతో పాక్ ఫ్యాన్స్ ఇలా రియాక్ట్ అవుతున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.