టీమిండియా టెస్టు క్రికెట్ చరిత్రలో వెరీ వెరీ స్పెషల్ ప్లేయర్ ఎవరు అంటే.. మన తెలుగువాడైన వీవీఎస్ లక్ష్మణ్ పేరే వినిపిస్తుంది. మొత్తం కెరీర్ లో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని లక్ష్మణ్ ఓ లెజండ్రీ క్రికెటర్ గా నిలవగలిగాడు. ప్రస్తుతానికి లక్ష్మణ్ నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్ గా బాధ్యతలు నిర్వహస్తున్నాడు. అయితే.. త్వరలోనే టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టబోతున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అదేంటి..? ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఉన్నారు కదా? ద్రవిడ్ ని ఎందుకు తీసేస్తున్నట్టు? ఇలాంటి ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే.. లక్ష్మణ్ హెడ్ కోచ్ గా రాబోతుండటం వెనుక పెద్ద కారణమే ఉంది.
ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత స్వదేశంలో టీమిండియా, సౌతాఫ్రికాతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది. ఇదే సమయంలో సీనియర్ ఆటగాళ్లతో కూడిన మరో జట్టు ఇంగ్లాండ్ లో పర్యటించనుంది. ఈ టీమ్తో పాటు భారత ప్రధాన హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా ఇంగ్లాండ్ వెళ్లనున్నారు. కాబట్టి స్వదేశంలో సౌతాఫ్రికాతో ఆడే టీ20 సిరీస్తో పాటు ఐర్లాండ్తో ఆడే రెండు వన్డేల సిరీస్కి కూడా వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నట్టు తెలుస్తోంది.
According to reports, VVS Laxman will be appointed as the head coach of India on their tour of Ireland for their two-match T20I series in the absence of Rahul Dravid .
Rahul Dravid will be looking after India’s preparation for their remaining fifth Test against England. pic.twitter.com/YL5bu8yw9v
— Sportskeeda (@Sportskeeda) May 18, 2022
ఇది కూడా చదవండి: T20 World Cup 2022: గంగూలీ మనసులో 2007 వరల్డ్ కప్ నాటి ఫార్ములా! సీనియర్స్ కి షాక్ తప్పదా?
టీమిండియాకి ఇలా ఇద్దరు హెడ్ కోచ్ లు ఉండటం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది ఇంగ్లాండ్ టూర్కి వెళ్లిన భారత ప్రధాన జట్టుకి అప్పటి హెడ్ కోచ్ రవిశాస్త్రి కోచ్గా వ్యవహరిస్తే.. అదే టైమ్లో లంక టూర్కి వెళ్లిన జట్టుకి రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్గా వ్యవహరించాడు. ఇప్పుడు కూడా ఫార్ములా రిపీట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇంగ్లాండ్ పర్యటన నేపథ్యంలో.. ఈ సిరీస్కి స్టార్ ప్లేయర్స్ అందరూ దూరం కానున్నారు. దీంతో.. ఈ సీరీస్ యువ ఆటగాళ్లకు ఈ సిరీస్ మంచి అవకాశంగా మారనుంది. ఐపీఎల్ 2022 సీజన్ లో అద్భుత ఆటతీరు కనబరుస్తున్న అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, మోహ్సీన్ ఖాన్, రాహుల్ త్రిపాఠి, వంటి ఆటగాళ్లు ఈ సిరీస్ లో ఎంట్రీ ఇవ్వనున్నారు.
VVS Laxman is likely to indian coach for upcoming t20 series.#vvslaxman #indiancricketteam pic.twitter.com/92k0hjBOdL
— Alex kumar arya (@aryacricxpert) May 18, 2022
2021లో భారత జట్టు ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాడ్ లో పర్యటించింది. అయితే.. 4 టెస్ట్ లు తరువాత కరోనా కారణంగా నిర్ణయాత్మకమైన 5వ టెస్ట్ వాయిదా పడింది.. ఆ టెస్టు ఇప్పుడు జూలై 1న జరుగనుంది. ఇదే సిరీస్ లో భారత జట్టు ఇంగ్లాండ్ తో 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్ లు ఆడనుంది. సో.. ఇది కూడా ఓ సుదీర్ఘ పర్యటన అనమాట. ఇందుకోసమే జూన్ నెల మధ్యలోనే లండన్కి బయలుదేరనుంది భారత జట్టు. మరి.. హెడ్ కోచ్ గా వి.వి.ఎస్ లక్ష్మణ్ ఎంత వరకు సక్సెస్ అవుతారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
VVS Laxman and Rahul Dravid were spotted together at the Brabourne stadium last night during the encounter between RCB and PBKS.
📸:@VVSLaxman281 pic.twitter.com/tDlZtSl7LI
— CricTracker (@Cricketracker) May 14, 2022