భారత క్రికెట్ ఆటగాళ్లకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి మనందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ పాక్ మహిళ కోహ్లీకి వీరాభిమాని అనే సంగతి మనకు తెలిందే. తాజాగా జరిగిన ఆసియా కప్ లో ఆ అభిమాని భారత మ్యాచ్ ల సందర్బంగా చేసిన హంగామ అంతా.. ఇంతా.. కాదు. దాంతో ఆ అమ్మాయి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఈ అమ్మాయి ఇన్ స్టాలో “లవ్ ఖానీ” పేరుతో ఖాతాను రన్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఆదివారం పాక్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ లో పాక్ ఓటమితో ఈ అమ్మడు స్టేడియంలోనే బోరున ఏడ్చింది. ఈ ఏడ్చిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
క్రికెట్ ఆటని.. ఆటగా కాకుండా ఒక ఎమోషన్ గా చూసే దేశాల్లో ప్రధమ స్థానంలో ఉంటుంది ఇండియా. అందుకే ఇండియా ఏదైనా టోర్నీకి వెళ్తోంది అంటే చాలు పూజలు.. హోమాలు.. యాగాలు లాంటివి జరిపిస్తారు అభిమానులు. అంతటి అభిమానం మనకు క్రికెట్ అంటే! మనలాగే కొంతమందికి క్రికెట్ అంటే పిచ్చి ఉంటుంది. ఇలాంటి పిచ్చిన ఉన్న అమ్మాయే ఆసియా కప్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆ అమ్మాయికి విరాట్ కోహ్లీ అన్నా.. క్రికెట్ అన్నా పిచ్చి. ఆమెది పాకిస్థాన్ అయినప్పటికీ కోహ్లీకి వీరాభిమని. అయితే ఆటలో కొన్ని కొన్ని సార్లు ఓటమిలు చవి చూడాల్సి వస్తుంది. ఆ ఓటమిని జీర్ణించుకోలేరు అభిమానులు. అదీ కాక కొందరు మ్యాచ్ లు ఓడిపోతే ఏడుస్తారు కూడా.
అయితే తాజాగా జరిగిన ఆసియా కప్ ఫైనల్లో పాక్ ఓడిపోవడంతో ఓ లేడీ అభిమాని కన్నీటి పర్యంతమైంది. తన బాధను చెప్పుకుంది.”కోహ్లీ సెంచరీ చేశాడు.. కానీ బాబర్ 5 పరుగులకే అవుటయ్యాడు.. అదీ కాక పాకిస్థాన్ గెలవక పోతే కనీసం భారత్ అయినా గెలిచేదని, అది నాకు ఆనందాన్ని కలిగించేదని” చెప్పుకొచ్చింది. ఇక తన పక్కన ఉన్న శ్రీలంక అభిమానులకు అభినందనలు తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో నెటిజన్స్ దీనిపై స్పందిస్తున్నారు. “ఎంత అభిమానం మేడం మీకు ఆటఅంటే! అని కొందరు అంటే.. మీరేం బాధపడకండి ఇంకో సారి గెలుస్తారు” అని మరికొందరు స్పందించారు. మరీ ఇంత అభిమానం ఉండకూడదు మేడం అని మరి కొందరు సరదాగా వ్యాఖ్యానించారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.