ఆసియా కప్ సమరానికి మరో వారం రోజులు మాత్రమే సమయముంది. ఈ నెల 27 నుంచి యూఏఈ వేదికగా టోర్నీ ప్రారంభం కానుంది. 28న పాకిస్తాన్ తో భారత జట్టు తలపడనుంది. ఈ తరుణంలో అందరూ ప్రాక్టీస్ సెషన్లతో తలమునకలై ఉంటే .. విరాట్ కోహ్లీ మాత్రం అనుష్క శర్మతో కలిసి రోడ్లపై చక్కర్లు కొడుతున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఇంగ్లాండ్ టూర్ తరువాత సుదీర్ఘ విరామం తీసుకున్న విరాట్ కోహ్లీ ఆసియా కప్ టూర్ లో ఏమాత్రం రాణిస్తాడు అన్నదే.. ఇప్పుడు అందరి నోటా మెదులుతున్న ప్రశ్న. ఒకప్పుడు కోహ్లీ అంటే.. ఇండియన్ క్రికెట్లో ఒక బ్రాండ్. తన బ్యాటింగ్తో, అగ్రెసివ్ కెప్టెన్సీతో భారత క్రికెట్ను మరోమెట్టు ఎక్కించిన ఆటగాడు. సచిన్ వంద సెంచరీల రికార్డును బద్దలు కొట్టేలా కనిపించిన ఒకే ఒక్క బ్యాట్స్మెన్. కానీ.. గతకొంత కాలంగా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతూ.. తన కెరీర్లోనే ఎప్పుడూ లేని పెద్ద గ్యాప్ను విశ్రాంతి పేరుతో తీసుకునే పరిస్థితి వచ్చింది. అయినా కోహ్లీపై ఇటు అభిమానులకు గానీ, అటు జట్టు కోచ్, కెప్టెన్కు గానీ నమ్మకం సడలలేదు.
#CelebWatch | @AnushkaSharma And Virat Kohli (@imVkohli) Spent Their Saturday Like This pic.twitter.com/U4NiXfqJb6
— NDTV (@ndtv) August 20, 2022
కింగ్ కోహ్లీ మళ్లీ కమ్బ్యాక్ చేస్తాడని బలంగా నమ్ముతున్నారు. అదే నమ్మకంతో ఒక వైపు కుర్రాళ్లు ఇరగదీస్తున్నా వారిని కాదని ఆసియా కప్ కోసం టీమిండియాలో కోహ్లీకి స్థానం కల్పించారు. ఇప్పటికైతే జట్టులో కోహ్లీ స్థానానికి వచ్చిన ముప్పేమీ లేదు కానీ.. ఆసియా కప్లో సైతం కోహ్లీ ఫామ్ అందుకోలేకపోతే.. కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ ఎలాగైన గెలవాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారు. అందుకోసమే కుర్రాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తూ.. పటిష్ట జట్టును తయారు చేస్తున్నారు. దీంతో విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ స్టార్ ఆటగాళ్లపై కొంత ఒత్తిడి ఉన్న మాట వాస్తవం.
India’s Pride #ViratKohli𓃵 & #AnushkaSharma @imVkohli @AnushkaSharma bhagwan aap dono ko sath rakhe aur khush rakhe 🙏🏼❤️ pic.twitter.com/mjYFr6H5f2
— RAJAT (@hopeuarefine) August 20, 2022
కానీ.. కోహ్లీ ఒక్కసారి ఫామ్ అందుకుంటే అతన్ని ఆపడం ఎవరి తరం కాదు. వరుస సెంచరీలతో కదం తొక్కగల ఆటగాడు. ఈ నేపథ్యంలో లాంగ్ రెస్ట్ తర్వాత ఆసియా కప్తో జట్టులోకి వస్తున్న విరాట్ కోహ్లీ తొలి మ్యాచ్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో ఆడనున్నాడు. ఈ మ్యాచ్పై క్రికెట్ ప్రపంచ మొత్తం ఆసక్తి చూసిస్తుందన్న విషయం తెలిసిందే. అందులోనూ.. కోహ్లీకి ఈ మ్యాచ్ మరింత ప్రత్యేకమైంది. ఎందుకంటే.. ఈ మ్యాచ్తో కోహ్లీ తన 100వ టీ20 మ్యాచ్ను పూర్తిచేసుకుంటాడు. కనీసం, ఈ మ్యాచ్లోనైనా కోహ్లీ వంద కొడితే చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు. మరి ఈ స్పెషల్ మైల్స్టోన్ మ్యాచ్లో కోహ్లీ సెంచరీ కొడతాడని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.